ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఎన్ఠీఆర్ అగ్ర నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల పాటు రూల్ చేశారు. ఆ తరువాత ఎన్ఠీఆర్ వారసత్వంతో బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వీరిలో బాలయ్య బాబు అగ్రనటుడుగా ఎదిగారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ జూనియర్ ఎన్ఠీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హీరోలుగా తెరంగేట్రం చేశారు. వీరిలో తారక్ అగ్ర నటుడుగా ఎదగడంతో పాటు పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు. తారక్ తరువాత కళ్యాణ్ రామ్ కూడా ఓ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకొని ఇప్పుడు బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తో మూవీ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ ఫామిలీ తో కలిసి బింబిసార సినిమాని తిలకించారు. ఈ సందర్భంగా సినిమాలో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే దర్శకుడు మల్లిడి వశిష్ఠ టేకింగ్ ని కూడా ప్రశంసించారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రతిభని గుర్తించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం అనేది నందమూరి వంశ చరిత్రలోనే ఉందని గొప్పగా చెప్పారు. గతంలో నాన్నగారు ప్రయోగాత్మక సినిమాలు చేశారని, అలాగే కొత్తవారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు.
బింబిసార ప్రయోగాత్మకమైన చిత్రమే కాకుండా భావి తరాలకి ఉపయోగపడే మంచి సందేశం కూడా ఉందని చెప్పుకొచ్చారు. కొత్తవారిని ప్రోత్సహించే అలవాటు నందమూరి వంశానికి మాత్రమే ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. నందమూరి ఫ్యామిలీ తర్వాత ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. వారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బింబిసార దర్శకుడి ప్రతిభని బాలయ్య ప్రశంసించడమే కాకుండా భవిష్యత్తులో కలిసి పనిచేద్దాం అంటూ అవకాశం కూడా ఇచ్చాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.