పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘భీమ్లా నాయక్’. టైటిల్ పాత్రలో పవన్ నటించగా, ఆయనకు ధీటైన డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా దగ్గుబాటి చేసారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా సత్తా చాటుతుంది. ఇక ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంపుకు సంబంధించిన జీవోను విడుదలలో ఆలస్యం చేసిందని, కొన్ని సెంటర్స్లో అయితే టికెట్ రేట్స్ను పాత జీవో ప్రకారమే అమ్మాలంటూ తహసీల్దారులతో చెప్పిండం లాంటివి జరిగాయంటూ పవన్ ఫ్యాన్స్, థియేటర్స్ యజమానులు ఏపీ ప్రభుత్వ తీరుని నిరసించారు.
మంత్రి గౌతమ్ రెడ్డి మరణం వల్ల జీవో ఆలస్యమైందే తప్ప కావాలనే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాను అడ్డుకోలేదని ప్రభుత్వ పెద్దలు చేటున్నారు. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ కొత్త వివాదంలోకి చిక్కుకుంది. గుంటూరు అర్బన్ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్కు శాలివాహన కుమ్మరి కార్పోరేషన్ ఛైర్మన్ పురుషోత్తం ఫిర్యాదు చేశారు. సినిమాలో ఓ సన్నివేశంలో కుండలు చేసే చక్రాన్ని మరో హీరో రానా దగ్గుబాటి కాలితో తన్నుతారు. ఆ సన్నివేశం వల్ల కుమ్మరుల మనో భావాలు దెబ్బ తిన్నాయని ఆ సన్నివేశాన్ని భీమ్లా నాయక్ సినిమా నుంచి తొలగించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై భీమ్లా నాయక్ మేకర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్కు రీమేక్గా ఈ సినిమాని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమా ని నిర్మించారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్గా చేస్తే.. సముద్ర ఖని కీలక పాత్రలో నటించి మెప్పించారు.