ఏపీ రాజకీయాలలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అలాగే ఓటుబ్యాంకు కూడా లేదు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే తెలంగాణలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. రాబోయే ఎన్నికలలో ఎలా అయినా అధికారంలోకి రావాలని గట్టిగా బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేయకపోవడంతో ప్రజలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీకి తెలంగాణలో జనసేన, టీడీపీ పార్టీలు పెద్ద గండంగా మారాయని చెప్పాలి. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ముందుకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా తమ వెంట తీసుకొని రావాలని భావిస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ పార్టీ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.
జనసేన, బీజేపీ కలిసి మూడో ప్రత్యామ్నాయంగా వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఇప్పటికే టీడీపీ పార్టీ తమ క్యాడర్ ని సమాయత్తం చేస్తూ తెలంగాణలో పోటీగా సిద్ధం చేస్తుంది. అలాగే జనసేన పార్టీ కూడా 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తుందని, అలాగే 35 నుంచి 50 స్థానాల వరకు పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. జనసేన, టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే కచ్చితంగా బీజేపీ ఓటుబ్యాంకుకి కచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.
అదే జరిగితే బీజేపీ ఆసలు గల్లంతు అయినట్లే. అయితే టీడీపీ, జనసేన పార్టీతో ఏపీలో బీజేపీ పార్టీని బలవంతంగా అయినా కలిసి వచ్చేలా చేయడంలో భాగంగా తెలంగాణలో బీజీపీకి టెన్షన్ పెట్టె పని మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పుడు జనసేన, టీడీపీ పార్టీల వైఖరిపై బీజేపీ ఆలోచనలో పడింది. అక్కడ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఏపీలో బీజేపీ తప్పనిసరి పరిస్థితిలో టీడీపీ, జనసేనతో కలిసి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. మరి ఈ పరిణామాలని బీజేపీ ఎలా తనకి అనుకూలంగా మార్చుకుంటుంది అనేది చూడాలి.