శతాబ్దాల పూర్వం ఎన్నో అద్భుతమైన కట్టడాలను అలనాటి భారత్ ఇంజినీర్లు నిర్మించారు.అవి నేటికీ చెక్కు చెదరకుండా ప్రస్తుత ఇంజినీర్ ల మేధా శక్తికి సవాళ్లు విసురుతున్నాయి.తాజాగా సిమ్లా లోని కాచి ఘట్టి ప్రాంతంలో ఉన్న ఒక ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ పేక ముక్కలా రాలిపోయింది.
అధిక వర్షాలు,కొండ చరియలు విరిగిపడుతుండడంతో భవనం కింద ఉన్న మట్టి వదులయ్యిందని దాని కారణంగానే బిల్డింగ్ కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు.ఈ సంఘటన ముందే జరుగుతుందని ఊహించిన సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ వారు 15 రోజులు క్రితమే ఈ బిల్డింగ్ లో నివాసం ఉంటున్న కుటుంబాలను తక్షణమే బిల్డింగ్ ఖాళీ చేయవల్సిందిగా ఆదేశించారు.