అభిమానానికి భాషతో సంబంధం లేదు. ముఖ్యంగా సినిమాపై ప్రేమకు బౌండరీలుండవు. అందుకే సినిమాలు చూడటానికి కొందరు సరిహద్దులు దాటితే.. మరికొందరు సముద్రాలు కూడా దాటి వస్తుంటారు. అలా తమిళ్ సూపర్ స్టార్.. తలైవా.. రజనీకాంత్ కోసం ఓ జంట జపాన్ నుంచి ఇండియాకు వచ్చింది. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.
![‘జైలర్’ మూవీ చూడటానికి జపాన్ నుంచి చెన్నై వచ్చిన దంపతులు 2 ‘జైలర్’ మూవీ చూడటానికి జపాన్ నుంచి చెన్నై వచ్చిన దంపతులు](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-10T121442.501.jpg)
తమ ఆరాధ్య నటుడి సినిమాను స్థానిక థియేటర్లలో తోటి అభిమానుల మధ్య చూడాలని జపాన్కు చెందిన ఓ జంట చెన్నై వచ్చింది. జపాన్లోని ఒసాకాకు చెందిన యసుదా హిడెతోషి తన సతీమణితో కలిసి ప్రత్యేకగా జైలర్ సినిమా కోసమే చెన్నై చేరుకున్నారు. గురువారం ఉదయం చెన్నైలోని థియేటర్లో తమిళ తంబీలతో కలిసి సినిమా చూసి ఖుషీ అయ్యారు. రజనీకి వీరాభిమాని అయిన యసుదా.. జపాన్లో ఆయన ఫ్యాన్ క్లబ్ లీడర్ కూడా. అభిమానులందరితో కలిసి సినిమా చూడటానికి తాము ఇక్కడి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇక్కడ తలైవా మేనియా మామూలుగా లేదని సంబురంగా చెబుతున్నారు.