Celebrities Buzz: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియా స్టార్ హీరోలు తమ బ్రాండ్ ఇమేజ్ ని ఇండియన్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాల ద్వారా ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమా అన్నా, సౌత్ సినిమాలు అన్న చిన్న చూపు చూసే నార్త్ ఇండియన్స్ ఇప్పుడు వాటికి పెద్ద పీట వేస్తున్నారు. సౌత్ నుంచి వచ్చే సినిమాలు నార్త్ ఆడియన్స్ హృదయాలని గెలుచుకుంటున్నాయి. అందులో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇండియా నుంచి మొట్టమొదటి సారిగా ఆస్కార్ అవార్డు వచ్చింది.
అయితే బాలీవుడ్ మీడియా గాని, సెలబ్రిటీలు గాని దీనిపై పెద్దగా రియాక్ట్ కాలేదు. సౌత్ సక్సెస్ ని కూడా వారు అంగీకరించ లేకపొతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల సర్వే రిపోర్ట్ ని బయట పెట్టింది. దీనిలో ఏకంగా టాప్ 1,2 లో రామ్ చరణ్, తారక్ ఉండటం విశేషం. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవడం ద్వారా వీరిద్దరూ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇదే లిస్ట్ లో షారుఖ్ ఖాన్ మూడో స్థానంలో విజయ్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఇక ప్రభాస్ 5వ స్థానంలో ఉన్నారు. ఆరవ స్థానంలో అల్లు అర్జున్, 7వ స్థానంలో సూర్య, 8వ స్థానంలో కిచ్చ సుదీప్ 9వ స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఈ టాప్ టెన్ లిస్టులో మెజారిటీ తెలుగు హీరోలు ఉంటే, రెండో స్థానంలో కోలీవుడ్ హీరోలు ఉన్నారు. హిందీ నుంచి షారుఖ్ ఖాన్ మాత్రమే స్థానం దక్కడం విశేషం. బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో హీరోల సక్సెస్ రేట్ తక్కువగా ఉండటం. అలాగే బడ్జెట్ పరంగా, కథల పరంగా సౌత్ తో పోటీ పడలేకపోవడం వలన వారు వెనుకబడిపోయారని తెలుస్తుంది.