AP Politics: రాజకీయంగా ప్రయాణం మొదలు పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్న తారకరత్న ఊహించని విధంగా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో తారకరత్న మరణం విషాద ఘటనగా మారింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అతని కల నెరవేరకుండానే రాజకీయాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి తిరిగిరాని లోకాలకి తారకరత్న వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ వచ్చి భౌతికకాయాన్ని చూసి నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తారకరత్న పార్ధివదేహాన్ని చూసేందుకు వచ్చారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చొని చాలా సేపు మాట్లాడారు. అలాగే మీడియా ముందుకి వచ్చి అడ్రెస్ చేసినపుడు కూడా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి కలిసి రావడం విశేషం. విజయసాయి రెడ్డి తారకరత్నకి మామయ్యా అవుతారు. అలాగే చంద్రబాబు కూడా మామయ్యా అవుతారు. ఈ కారణంగానే యాదృశ్చికంగా వీరిద్దరూ తారకరత్న మృతి సమయంలో కలవడం జరిగింది.
అయితే వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉండటం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు ఈ విజువల్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. పార్టీల మధ్య రాజకీయపరమైన గొడవలు ఎన్ని ఉన్నా కూడా ఒకరికి ఒకరు ప్రత్యర్ధులు కాదనే విషయాన్ని ఇలాంటి ఫోటోలు రుజువు చేస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిసి తారకరత్న భౌతికకాయం దగ్గర కొద్ది సేపు మాట్లాడుకునే వీడియో బయటకి రావడంతో అసలు వారు ఏం మాట్లాడుకొని ఉంటారు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.