రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీపీఐ రామకృష్ణ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై హైకోర్టు బెంచ్ విచారించి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు తాజాగా దీనిపై విచారించడంతో పాటు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము కలుగజేసుకోమని తెలియజేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. ఇక ప్రభుత్వానికి ఇప్పుడు హైకోర్టులో ఉన్న పిటీషన్ పై కౌంటర్ పిటీషన్ వేయడం తప్ప మరో ఛాన్స్ లేదని చెప్పాలి. ఇదిలా ఉంటే సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు.
జీవో విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని చంద్రబాబు నాయుడు అన్నారు. హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతూ ఉండగానే సుప్రీంకోర్టుకి వెళ్ళడం పిచ్చి చర్య అని అన్నారు. ఇలాంటి నిర్ణయాలతోనే జగన్ రెడ్డి సైకో అని పదే పదే అనిపించుకున్నాడు అంటూ విమర్శించారు. ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇలాంటి జీవోలని తీసుకొచ్చి ప్రతిపక్షాలని అణచివేసే ప్రయత్నం జగన్ రెడ్డి ఆపేసి పాలనపై దృష్టి పెట్టాలని అన్నారు.
అలాగే ఈ జీవోని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే జీవో నెంబర్ 1 రద్దుపై కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కచ్చితంగా దీనిపై బలమైన వాదనలు వినిపించి ఇది అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ నెల 23వరకు జీవో1ని రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే జీవోని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.