YSRCP: ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల బలం 154 అనే సంగతి తెలిసిందే. అయితే ఈ స్థాయిలో బలం ఉంటే ఎమ్మెల్యే కోటాలో నిలబడే ఎమ్మెల్సీ అభ్యర్ధులకి పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకునే అవకాశం ఉంటుంది. సంఖ్యాబలం లేని టీడీపీ అభ్యర్ధులని నిలబెట్టిన అది కేవలం నామమాత్రంగా ఉంటుంది అని చెప్పాలి. అలా ఎవరైనా పోటీ చేసారంటే వారికి అవమానకరమైన ఓటమి తప్పదు. అయితే టీడీపీలో చంద్రబాబు ఎన్ని అవమానాలు చేసిన భరించడానికి సిద్ధంగా ఉండేవారు కొంతమంది ఉన్నారు. ఆత్మగౌరవం కోసం బయటకొచ్చిన కొడాలి, వల్లభనేని వంశీ, రోజా తరహాలో కాకుండా చంద్రబాబు ఏం చేసిన అది అద్భుతమైన వ్యూహం అని నమ్ముతారు.
ఇక చంద్రబాబు కూడా తనని నమ్మిన వారిని మోసం చేయడంలో దిట్ట కాబట్టి బీసీ, ఎస్సీ వర్గాల వారిని ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నిలిపి బలిపశువులని చేస్తాడు. ఇదులో భాగంగా ఈ సారి ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ పోటీలకి ఇప్పటికే వైసీపీ నుంచి నామినేషన్లు పడ్డాయి. అయితే అవి ఏకగ్రీవం కాకుండా చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు. ఇప్పటికి టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీకి మద్దతు ఇస్తున్నముగ్గురు అదే పార్టీలో ఉన్నారు. అలాగే వైసీపీలో కూడా రెబల్ లీడర్స్ ఇద్దరు ఉన్నారు.
వీరిని చూసుకొని పార్టీ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులకి ఓటు వేయకుండా విప్ జారీ చేయాలని చూస్తున్నారు. అలాగే ఏకగ్రీవం లేకుండా పోటీలో తమ పార్టీ నుంచి అభ్యర్ధులని బరిలో నిలపాలని భావిస్తున్నారు. దానికోసం బలిపశువులని సిద్ధం చేస్తున్నారు. విప్ జారీ చేయడం వలన టీడీపీ రెబల్ లీడర్స్ వైసీపీకి ఓటు వేయలేరు అనేది చంద్రబాబు నమ్మకం. అయితే పోటీ ఉన్నా కూడా పెద్దగా ఒరిగేది ఏమీ లేకపోయిన చంద్రబాబు ఇగో చల్లార్చుకోవడం కోసం ఈ పని చేస్తున్నారు అంటూ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.