Chikoti Praveen : తెలుగు రాష్ట్రాను ప్రస్తుతం కుదిపేస్తున్న వ్యవహారం క్యాసినో. ఈ వ్యవహారంతో సడెన్గా చికోటి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి హైలైట్ అయ్యాడు. అసలు ఏంటీ క్యాసినో వ్యవహారం. అసలు ఎవరీ చికోటి ప్రవీణ్? ఒక సాధారణ వ్యక్తి నుంచి క్యాసినో దందాలో కింగ్ పిన్గా ఎలా మారాడు? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం. ప్రతీ వ్యక్తికి ఒక ప్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ కొందరివి మాత్రమే చాలా ఆసక్తికరంగా ఒక ‘బాషా’లో రజినీకాంత్కు ఉన్నంత రేంజ్లో ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకడే ఈ చికోటి ప్రవీణ్. నిజానికి అతని గతం తెలియనంత వరకూ అతనో సాధారణ వ్యక్తి. ఒక్కసారి అతడి గతం తెలిశాక అందరి చూపూ అతడి వైపే ఉంది. తాజాగా చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలతో ఒక్కసారిగా హైలైట్ అయ్యాడు. ఒక్కసారిగా అతడి ఫ్లాష్బ్యాక్ అంతా వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో అతనో పెను సంచలనంగా మారిపోయాడు.
Chikoti Praveen: అసలు ఎవరీ చికోటి ప్రవీణ్ కుమార్..?
20ఏళ్ల క్రితం ఓ చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారం నిర్వహించేవాడు. అతడు హైదరాబాద్లో నివాసముండేవాడు. వ్యాపారంలో కొంత డబ్బు కూడ బెట్టాక సినిమాల వైపు అతని దృష్టి మళ్లింది. దీంతో సినీ నిర్మాతగా మారాడు. మొత్తానికి దెబ్బకొట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అదే సమయంలో ఓ వైద్యున్ని కిడ్నాప్ చేసి జైలుకు సైతం వెళ్లాడు. తర్వాత తన మకాంను గోవాకు మార్చాడు. మెల్లిమెల్లిగా క్యాసినో దందాలో కింగ్ పిన్గా మారాడు. చికోటి ప్రవీణ్కి రెగ్యులర్ కస్టమర్లు 500మంది దాకా ఉన్నారు. అందులో చాలామంది రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా నేతలే ఉండటం విశేషం. క్యాసినో ఈవెంట్కి అడ్వాన్స్ కింద ఐదు లక్షలు చెల్లిస్తారట. మొత్తంగా అప్పుల ఊబి నుంచి బయటపడటమే కాకుండా.. విదేశాల్లో క్యాసినో పేరుతో కోట్లకు పడగలెత్తాడు చికోటి ప్రవీణ్. విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల రంగప్రవేశంతో సీన్ మారిపోయింది. ఒక్కసారిగా సంచలనానికి కేరాఫ్గా మారిపోయాడు. దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పత్తాలాటతో కోట్ల రూపాయల హవాలా దందా చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ దందాపై ఈడీ దూకుడు పెంచింది. నేపాల్లో క్యాసినో ఈవెంట్కి పెద్ద సంఖ్యలో పంటర్లు వచ్చేలా టాలీవుడ్ , బాలీవుడ్ నుంచి హీరోయిన్స్తో గ్రాండ్గా ప్రమోషన్ చేశాడని విచారణలో తేలింది. మేం కూడా క్యాసినోకి వస్తున్నామంటూ సినీ తారలతో ప్రచారం చేయించేవాడు. అందుకు గాను వాళ్లకి లక్షల్లో పారితోషికాలు ముట్టజెప్పాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. చికోటి నుంచి మల్లికా షెరావత్కు కోటి.. ఈషా రెబ్బాకు 40 లక్షలు.. గణేశ్ ఆచార్యకు 20 లక్షలు.. ముమైత్ ఖాన్కు 15 లక్షలు.. అమీషా పటేల్కు 80 లక్షలు.. డింపుల్ హయాతీకి 40లక్షలు.. అలాగే గోవిందాకు 50 లక్షలు చెల్లింపులు చేశాడు. ఈ క్రమంలోనే అమిషా పటేల్, ఈషా రెబ్బా, ముమైత్ ఖాన్, డింపుల్ హయతిలకు కూడా ఈడీ నోటీసులిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చికోటి వాట్సాప్ చాట్ బ్యాక్ అప్ను సైతం ఈడీ వెలికి తీసింది. చికోటి ఫోన్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల జాబితాను గుర్తించింది. రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతో పరిచయాలున్నట్టు తేల్చింది. చికోటి రాజకీయ నేతలతో గోవాలో జల్సాలు చేసినట్లు సైతం గుర్తించింది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది