Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నిర్మాతలకి ఏకంగా థీయాట్రికల్ ప్రాఫిట్ తో పాటు డిజిటల్, శాటిలైట్ రూపంలో మరో 70 కోట్ల వరకు ఆదాయం వచ్చింది అని చెప్పాలి. మెగాస్టార్ చరిష్మాకి సరైన కథ పడితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయనేది వాల్తేర్ వీరయ్య సినిమా ప్రూవ్ చేసింది. రాజకీయ ప్రస్థానం ముగించుకొని మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యతో ఐదు సినిమా పూర్తి చేశాడు. ఒక్క ఆచార్య తప్ప మిగిలిన సినిమాలు అన్ని కూడా 1 50 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇందులో వాల్తేర్ వీరయ్య సినిమా తప్ప మిగిలినవన్నీ కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇక సైరా, వాల్తేర్ వీరయ్య సినిమాలు అయితే ఏకంగా 2౦0 కోట్లకి పైగా కలెక్ట్ చేశాయి. దీనిని బట్టి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని మార్కెట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య వరకు కేవలం 50 నుంచి 60 కోట్ల వరకు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే తన మార్కెట్ వేల్యూ తెలియడంతో ఇప్పుడు ఏకంగా 100 కోట్లకి అమాంతం పెంచేసినట్లు తెలుస్తుంది. ఒక్క తెలుగులోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా 200 కోట్ల వరకు కలెక్ట్ చేసే స్టామినా ఉంది.
మరి పాన్ ఇండియా కథలు పడితే కచ్చితంగా భారీ కలెక్షన్స్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేయాలని డిసైడ్ అయిన మెగాస్టార్ కమర్షియల్ కథలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. భోళా శంకర్ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్ కావడంతో నెక్స్ట్ చేయబోయే అన్ని సినిమాలకి వంద కోట్ల రెమ్యునరేషన్ ని అడుగుతున్నట్లు తెలుస్తుంది. నిర్మాతలు కూడా ఆ స్థాయిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.