ముహర్రం ఊరేగింపుకు ముందుగా నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ గురువారం దబీర్పురాలోని చారిత్రాత్మక బీబీ కా ఆలమ్ను సందర్శించి ధట్టిలు సమర్పించారు.
అనంతరం సౌత్ జోన్లోని శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసుల జోనల్ ఇన్ఛార్జ్లతో సమావేశం నిర్వహించి జూలై 29న పండగ ముగిసే వరకు భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆనంద్ వెంట డీసీపీ (సౌత్ జోన్) పి.సాయి చైతన్య సహా సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు.