ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీల మైదానంలో రావణ దహనం చాలా గ్రాండ్ గా జరుగుతుంది అనే విషయం అందరికి తెలిసిందే. భారీ ఎత్తున జరిగే ఈ వేడుకకి వేలాది మంది వస్తూ ఉంటారు. దేశ వ్యాప్తంగా జరిగే అతి పెద్ద వేడుక ఇది. ఈ వేడుకలో చాలా మంది ప్రముఖులు పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ సారి ఆ అవకాశం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి దక్కింది. ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించిన సంగతి తెలిసిందే. నార్త్ ఇండియా మొత్తం ఇప్పుడు ఆదిపురుష్ సినిమా బజ్ నడుస్తుంది. నేషనల్ మీడియా సైతం ఆదిపురుష్ సినిమాపై ప్రత్యేకంగా చర్చలు పెడుతుంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒక రూపంలో సినిమాపై సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఒక బజ్ నడుస్తుంది.
ఇది సినిమా మీద మరింత అంచనాలు పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదిపురుష్ పై నెగిటివ్ స్ప్రెడ్ చేసేవారిని మెప్పించడంతో పాటు సినిమాపై పాజిటివ్ గా ఉన్నవారిని సంతృప్తి పరచడానికి దర్శకుడు ఓం రౌత్ విజువల్ ఎఫెక్ట్స్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే రామ్ లీల మైదానంలో జరిగే రావణ దహనంలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఢిల్లీ ప్రజలు అందరూ కూడా మైదానం వైపు వెళ్లేలా చేస్తుంది. ప్రభాస్ ని దగ్గరనుండి చూడాలనే ఆసక్తితో యూవత రామ్ లీల మైదానంకి వెళ్తున్నారని తెలుస్తుంది.
ఈ సారి మరింత ఎక్కువ మంది ఈ వేడుకని తిలకించడానికి వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ లో దేశ అధ్యక్షురాలి సమక్షంలో ఆదిపురుష్ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడటంతో పాటు రావణదహనంలో కూడా తన చేతుల మీదుగా నిర్వహించబోతున్నాడు అని తెలుస్తుంది. దీని తర్వాత ఈ నెల 15 తర్వాత హైదరాబాద్ లో ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.