ఆ హీరోయిన్ లలిత జ్యువెల్లరీస్ ఎండి అంత పెద్ద కోటీశ్వరుడయ్యాడా.
లలిత జ్యువెలరీస్ గురించి తెలియని వారు లేరు. లలిత జ్యువెలరీస్ అడ్వటైజ్మెంట్ లు కూడా సంచలనంగా మారాయి. లలిత జ్యువెలరీస్ పై ఎన్నో రూమర్స్ కూడా రావడాన్ని మనం చూసాము. కేవలం డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే ఒక్క డైలాగ్ తో లలిత జ్యువెలరీస్ ఎండి కిరణ్ కుమార్ ఫేమస్ అయిపోయారు. సింపుల్గా ఒకే ఒక్క డైలాగ్ అందరికీ చెప్పి బ్రాండ్ ని ప్రమోట్ చేసి మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు .
![ఆ హీరోయిన్ వల్లే లలిత జ్యువెల్లరీస్ ఎండి అంత పెద్ద కోటీశ్వరుడయ్యాడా..? 2 ఆ హీరోయిన్ వల్లే లలిత జ్యువెల్లరీస్ ఎండి అంత పెద్ద కోటీశ్వరుడయ్యాడా..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-28T110734.870.jpg)
చాలా చోట్ల లలిత జ్యువెలరీస్ ని పెట్టారు. అయితే ఆయనకి ఇంత సక్సెస్ రావడానికి కారణం ఒకే ఒక హీరోయిన్. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కిరణ్ కుమార్ తెలియచేసారు . నాకు హీరోయిన్ సావిత్రి అంటే చాలా ఇష్టం. ఆమె మీద ప్రేమతోనే వాళ్ల ఫ్యామిలీ వాళ్లు కట్టించిన ఇంట్లో చాలా రోజులు రెంట్ కి కూడా ఉన్నానని ఆయన చెప్పారు. అయితే ఆ ఇంట్లో అద్దెకి దిగిన తర్వాత వ్యాపారంలో కలిసి వచ్చిందని చెప్పారు కిరణ్ కుమార్. ఆ ఇల్లు అమ్మేస్తాను అని కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు ఆ ఇల్లు కొనుగోలు చేస్తానని వాళ్ళకి చెప్పానని ఆయన తెలియచేసారు .
అలానే ఆమె కుటుంబ సభ్యులు కూడా కిరణ్ కుమార్ కి సావిత్రి పై చాలా ప్రేమ ఉందని, సావిత్రికి బంగారు ఆభరణాలు అంటే బాగా ఇష్టమని, బంగారు ఆభరణాలు చేసే కిరణ్ కుమార్ కి ఈ ఇల్లు అమ్మితే ఆమె ఆత్మ కూడా శాంతిస్తుందని కిరణ్ కుమార్ కి అమ్మేశారంట . ఈయన పెద్ద బిజినెస్ మాన్ అయినా కూడా సావిత్రి ఇంట్లోనే ఇంకా ఉంటున్నారంట . సావిత్రి మీద ఉన్న ప్రేమతో ఆమె పేరుని కూడా ఆ ఇంటికి తొలగించలేదని.. సావిత్రి ఇంటికి వెళ్లిన తర్వాత అదృష్టం బాగా కలిసి వచ్చిందని వ్యాపారంలో లాభాలు బాగా వచ్చాయని కిరణ్ కుమార్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియచేసారు .