టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టిన దిల్ రాజు నేడు అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగారు. పక్కా ప్లానింగ్ తో సినిమా లు నిర్మించి హిట్స్ కొట్టడంలో దిల్ రాజు స్టయిలే వేరు. అందుకే అత్యధిక శాతం విజయాలు కలిగిన నిర్మాతగా నిలిచారు. ఇక దిల్ రాజు వ్యక్తిగత జీవితం కూడా అనేక మలుపులు తిరిగింది. 2017లో దిల్ రాజు తన సతీమణి అనితని కోల్పోయారు. దీనితో దిల్ రాజు కొంతకాలం ఒంటరిగా ఉన్నారు. అయితే కరోనా టైంలో దిల్ రాజు తేజశ్విని అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంటకి గత ఏడాది ఒక కుమారుడు కూడా జన్మించాడు.
![టాలీవుడ్ సెలెబ్రెటీలకు దిల్ రాజు గ్రాండ్ పార్టీ.. ఎందుకంటే..? 2 టాలీవుడ్ సెలెబ్రెటీలకు దిల్ రాజు గ్రాండ్ పార్టీ.. ఎందుకంటే..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/06/a16571c3-97e7-4388-b458-5723da049492.jpg)
దిల్ రాజు :
జూన్ 29న దిల్ రాజు కుమారుడి మొదటి బర్త్ డే జరగనుంది. తన కొడుకు ఫస్ట్ బర్త్ డే కావడంతో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బర్త్ డే పార్టీని జెఆర్సీకి కన్వెన్షన్ లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. దీని కోసం దిల్ రాజు టాలీవుడ్ ప్రముఖు సెలెబ్రిటీలందరిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయ ప్రముఖులు కూడాన హాజరవుతారట.
దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి కూడా బలగం చిత్రంతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రస్తుతం పలు చిత్రాలని నిర్మిస్తున్నారు. అందులో ప్రముఖంగా భారీ బడ్జెట్ లో రాంచరణ్, శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది.