టాలీవుడ్ లో గత ఏడాది ఇద్దరు పెద్ద స్టార్స్ అయిన కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే సీనియర్ వెటరన్ స్టార్ నటి జమున మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇంట్లోనే చనిపోయింది. ఇక కైకాల సత్యనారాయణ కూడా గత ఏడాది మృతి చెందారు. వీరి మృతితో సుమారుతో టాలీవుడ్ లో మొదటి, రెండు తరాల నటులు అందరూ కూడా కనుమరుగు అయినట్లే. అలాగే అప్పటి దర్శకులు కూడా మృతి చెందరు. ఇదిలా ఉంటే ఈ కొత్త ఏడాదిలో హీరోయిన్ జమున మృతి ఘటన మరువక ముందే దర్శకుడు సాగర్ గురువారం మృతి చెందారు.
చెన్నైలో ఆయన నివాసంలోనే సాగర్ మృతి చెందడం గమనార్హం. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అమ్మదొంగ, జగదేగ వీరుడు లను తెరకెక్కించారు. తెలుగు దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. టాలీవుడ్ లో స్టార్ దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్, శ్రీను వైట్ల సాగర్ దగ్గర అసిస్టెంట్ లు కెరియర్ మొదలు పెట్టారు. ఇక ఈయన కెరియర్ లో తెలుగు, కన్నడ భాషలలో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన చివరిగా కన్నడంలో 2019లో కార్మిక అనే సినిమాని తెరకెక్కించారు.
ఇదిలా ఉంటే సాగర్ మృతి పట్ల తెలుగు సినిమా ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణతో అమ్మదొంగ అనే సినిమాతో సాగర్ దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లోనే ఆయన మృతి చెందారు. చెన్నైలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తుంది.