సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ రామ్ చరణ్ హీరోగా ఆర్.సి15 మూవీ ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకంగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ ఇదే కావడం స్టార్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
గత నెల వరకు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉంటే సడెన్ గా డైరెక్టర్ శంకర్ ఈ సినిమా షూటింగ్ ఆపేసి కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఆ సినిమాకి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసినట్లు శంకర్ ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు భారతీయుడు స్సీకెల్ గా వస్తున్న సినిమా అయినందు వలన దానిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ సినిమా స్టార్ట్ కావడంతో రామ్ చరణ్ తో తీయబోయే సినిమాని ఇప్పట్లో మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్లడం కష్టం అనే మాట వినిపించింది.
దీంతో మెగా ఫాన్స్ రంగంలోకి దిగి రామ్ చరణ్ సినిమా అప్డేట్ ఏంటో చెప్పాలని శంకర్ కి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ లు పెట్టడం మొదలు పెట్టారు. రీసెంట్ గా మెగా కార్నివాల్ లో దిల్ రాజు కూడా రామ్ చరణ్ కొత్త సినిమా అప్డేట్ శంకర్ చెప్పే వరకు తాను వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాగురించి శంకర్ ట్విట్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చారు. ఇండియన్2, రామ్ చరణ్ 15 చిత్రంలో ఈక్వెల్ గా ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్స్ చేస్తానని స్పష్టం చేశారు. ఆర్.సి15 నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్, వైజాగ్ లలో జరుగుతుందని చెప్పి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్తా శాంతించారు.