శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ముంబై ముద్దుగుమ్మ సీరత్ కపూర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో సీరత్ కపూర్ నటన అద్భుతంగా ఉండడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
ఈ సినిమా తరువాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత సిరత్ కపూర్ కు పెద్దగా ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు కూడా రాలేదు. ఈ ముద్దుగుమ్మ ముంబైలో జన్మించింది. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు ఒక మంచి డాన్సర్. చదువు పూర్తవగానే బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా చేసింది.
![“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…? 2 “రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-05T181243.821.jpg)
నటనపై ఉన్న ఆసక్తితోనే సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేక ఆడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈ అమ్మడు మోడలింగ్, డ్యాన్సర్ గా తన కెరీయర్ ను కొనసాగిస్తోంది. ఎంతో అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ పలు సర్జరీలు చేయించుకోవడంతో ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన అభిమాన ప్రేక్షకులు కూడా తనని చూసి ఆశ్చర్యపోయేంతలా మారిపోయింది.