ఏపీ మంత్రులపై చిరంజీవి ఘాటు కామెంట్స్ ఇటీవల సినిమా ఇండస్ట్రీ పై రాజకీయ నేతల విమర్శలు ఎక్కువవుతున్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాపై ఏపీ సర్కార్, ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు . ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలను వదిలారు . ఇదే కాకుండా.. గతకొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టుముడుతున్న కొన్ని రాజకీయాంశాలపై చిరంజీవి మాట్లాడారు.
![ఏపీ మంత్రులపై చిరంజీవి ఘాటు కామెంట్స్...అవసరమా మీకు..? 2 ఏపీ మంత్రులపై చిరంజీవి ఘాటు కామెంట్స్...అవసరమా మీకు..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-07T122354.454-1.jpg)
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ వేడుకలోనే చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’’ అని చురకలు అంటించారు చిరంజీవి గారు.