Elephanat : దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేశంలోని చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నో భయంకర దృశ్యాలు, హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షం ఎఫెక్ట్తో బీహార్లోని వైశాలి జిల్లా రాఘవ్పూర్లో గంగా నది కూడా పరవళ్లు తొక్కుతుంది. అయితే.. గంగానదిలో ఓ మావటి తన ఏనుగుతో సహా చిక్కుకుపోయాడు. ఏనుగును ఎలాగైనా నది దాటించాలి. కానీ అది ఒక్కడి వల్ల కాదు. బోటు అవసరం. కానీ అంత వెచ్చించేంత ధనం కూడా తన వద్ద లేదు. సరే ఎలాగోలా దాటాలని నిశ్చయించుకుని తన పయనం ప్రారంభించాడు.
Elephanat : బతుకుతామన్న ఆశ కూడా చచ్చిపోయింది..
అకస్మాత్తుగా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో.. ఏనుగుతో పాటు మావటి నీటిలో చిక్కుకుపోయాడు. ఎటు చూసినా వరద ప్రవాహమే. వరద ప్రవాహం వల్ల గంగా నదిలో కొంత దూరం ఇద్దరూ కొట్టుకుపోయారు. కనీసం సాయం చేసే దిక్కు కనిపించలేదు. మరోవైపు నీటి ఉధృతి క్షణక్షణానికి పెరుగుతోంది. ఆ నీటి ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతోంది. బతుకుతామన్న ఆశ కూడా మావటిలో చచ్చిపోయింది. కానీ ప్రయత్నలోపం ఉండకూడదు. ఆ సమయంలో బ్రెయిన్ చురుకుగా పనిచేస్తే చాలు.. దాదాపు గండం నుంచి గట్టెక్కవచ్చు. ఏదో ఒకటి చేసి బయటపడటం ముఖ్యం అనుకున్నాడో ఏమో కానీ.. ఏఈ పరిస్థితుల్లో ఆ మావాటి సాహస నిర్ణయం తీసుకున్నాడు.
తన ఏనుగుపై నమ్మకంతో ప్రవాహానికి ఎదురుగా వెళ్లాడు. ఆ ఏనుగు సైతం తన మావటిని రక్షించేందుకు సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది. ఏనుగుపై ఉన్న మావటివాడు కూడా తన ఏనుగుతో సహా నదిని దాటాలని గట్టిగానే భావించాడు. అతని ప్రయత్నం ఫలించింది. నది మలుపులో ఒకచోట కొందరు వ్యక్తులు ఉండటాన్ని గమనించాడు. తన ఏనుగును ఆ వైపుగా మళ్లించాడు. మొత్తానికి వారి సాయంతో ఏనుగుతో సహా మావటి నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బీహార్కు చెందిన ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆ ఏనుగుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రియల్ బాహుబలిగా కీర్తిస్తూ నెటిజన్లు దానిని ఆకాశానికి ఎత్తుతున్నారు.