యశోధర్ వేద కుటుంబంతో కలిసి కోర్టుకు వెళ్తాడు. అక్కడ వేద భర్తని మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామని మాటివ్వమని అడుగుతుంది. మన మధ్య మూడో మనిషికి చోటు ఉండదని యశ్ మాటిస్తుండగానే మాళవిక పిలుస్తుంది. దాంతో యశ్ వేద చేతిలో చేయి వేయడం ఆపేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మాళవిక, వేదలు గెలుపు నాదే అంటూ నాదే అంటూ పోట్లాడుకుంటారు. యశోధర్ నాపైపు ఉన్నాడు కాబట్టి నేనే గెలుస్తానంటుంది మాళవిక. ఆ తర్వాత ఖుషి దేవుడి దగ్గరికి వెళ్లి మొక్కుకుంటుంది. మా అమ్మమ్మకు ఆక్సిడెంట్ చేసిన వారికి శిక్ష పడేలా చేయి స్వామి అంటూ వేడుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. మాళవిక మాటలకు బాధపడుతూ దిగులుగా కూర్చుంటుంది వేద. మాళిని వచ్చి కోడల్ని ఓదారుస్తుంది. లోకంలో ఏ భార్యకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. కానీ ఒకటి చెప్పగలను. వాడు మంచివాడు అంటుంది మాళిని. ఆయన గురించి నాకు భయం లేదు అత్తయ్య కానీ.. అంటుండగా ఆ మాళవికతో నీకు పోలికేంటి వేద. నువ్ దేవతవి అది రాక్షసి. అపుడు ఖుషి కోసం కూడా నువ్ ఒక తల్లిలా ఫైట్ చేసి గెలిచినవ్. ఇపుడు మీ అమ్మ కోసం ఓ కూతురిలా పోరాడుతున్నావ్. న్యాయం నీవైపే ఉంది వేద. నువే గెలుస్తావ్ అంటూ ధైర్యాన్ని నూరిపోస్తుంది మాళిని. ఆ మాళవిక కోరలు పీకేయాలి. మీ అమ్మని చంపాలని చూసిని ఆ దుర్మార్గురాలికి బుద్ది చెప్పినదానివి అవుతావ్ అంటుంది మాళిని.
అపుడే లాయర్ ఝాన్సీ వచ్చి.. ఇదంతా జరగాలి అంటే వేద సపోర్ట ఉండాలి. నీవైపు నిజాయితీ ఉంది కదా న్యాయం నీ వైపే ఉంటుంది. న్యాయాన్ని గెలిపించడం కోసం నీ భర్త మీద నువ్ తిరగబడ్డావ్.. అందుకే నేను కేసును టేకప్ చేసాను. తిరగబడ్డావ్ వెనక్కి తిరిగి చూడాకు అంటుంది లాయర్. తప్పు చేసిన ఆ మాళవికని క్షమించేంది లేదని ధైర్యంగా చెబుతుంది వేద. ఇదే నాకు కావాల్సింది అంటూ వేదని ఎంకరేజ్ చేస్తుంది ఝాన్సీ. గెలిచేది నువ్వు.. గెలిపించేది నేను అంటుంది లాయర్ వేదతో.
సీన్ కట్ చేస్తే. ఖుషి పక్కకు వెళ్లి ఆదిత్య కూడా దేవుడిని మొక్కుతాడు. నేను మా అమ్మ కోసం ప్రేయర్ చేయడానికి వచ్చిన అని ఆది అంటే నేను కూడా మా వేద అమ్మ కోసం ప్రేయర్ చేస్తున్నా అంటుంది ఖుషి. నువ్ నాకు నచ్చట్లేదని అంటాడు ఆది. నాకు వేద అమ్మనే అమ్మ అంటుంది ఖుషి. వేద అమ్మనే గెలవాలి అంటుంది ఖుషి. అయితే నేను నీతో కటిఫ్ అంటూ కోపంగా వెళ్లిపోతాడు ఆదిత్య.
ఆ తర్వాత సులోచన, మాళినిలో కోర్టులో కూర్చుంటారు. గెలుపు గురించి భయపడుతుంది సులోచన. అపుడే వేద, మాళవికలు కూడా ఒకేసారి ఎంట్రీ ఇస్తారు కోర్టులోకి. ఇద్దరూ చెరో వైపు కూర్చుంటారు. కోర్టులోకి వచ్చిన యశోధర్ తన సీటు ఎటో అనుకుంటూ ఆలోచిస్తాడు. మాళవిక పిలిచి ఇక్కడ కూర్చో యవ్ అంటుంది. దాంతో యశ్ వెళ్లి మాళవిక పక్కన కూర్చుంటారు. మాళవిక చేసిన పనికి పీకలదాకా కోపంతో ఊగిపోతారు సులోచన, మాళినిలు. ఆ తర్వాత చిత్ర మాటలకు కోప్పడుతుంది వేద.
సీన్ కట్ చేస్తే.. జడ్జి వస్తాడు కోర్టులోకి. లాయర్ ఝాన్సీ లేచి తన క్లైంట్ గురించి చెప్తుంది. పైకి ఆక్సిడెంట్ లా కనిపిస్తున్నా ఇది హత్యా ప్రయత్నం అంటుంది లాయర్. మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని జడ్జి అడగ్గా.. ఎవరో కాదు యువరానర్ ఇక్కడే ఉన్న మాళవిక హత్యచేసే ప్రయత్నం చేసిందంటుంది ఝాన్సీ. దీనికి గాను తనకు తగిన శిక్ష విధించాలని కోరుకుంటుంది లాయర్ ఝాన్సీ. అపుడే అబ్జెక్షన్ యువరానర్ అంటూ యశ్ తరపున లాయర్ పరమేశ్వర్ లేచి మాట్లాడతాడు. ఇదంతా బోగస్ కేసు అంటూ కొట్టిపారేస్తాడు. అపుడు ఝాన్సీ ఇదొక అటెమ్ట్ మర్డర్ కేసు అంటుంది ఝాన్సీ. ఫ్రూఫ్స్ ఉన్నాయా? అని పరమేశ్వర్ ఝాన్సీని ప్రశ్నిస్తాడు. ఉన్నాయి నిరూపిస్తా అంటూ సమాధానమిస్తుంది ఝాన్సీ.
ఆ తర్వార మాళవిక లేచి ‘జడ్జి గారు నేరం నేనే చేశానని ఎవరూ ఫ్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేరం నేనే చేశానని ఒప్పుకుంటున్నాను’ అంటుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి మాళవిక నేరం ఒప్పుకోవడానికి గల కారణాలేంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..