భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక విషయాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతున్నారని సోమవారం నాడు చేసిన ప్రసంగంలో ఆరోపించారు.
‘‘ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా 155టీఎంసీల నీటిని ఎత్తిపోయడం జరిగిందని, సాగునీటికి వినియోగించే ఈ నీళ్ల వల్ల రూ.600 కోట్ల విలువైన పంటలు పండాల్సి ఉందన్నారు. టీఎంసీ అడుగుల నీటి ద్వారా గరిష్ఠంగా 10 వేల ఎకరాలకు సాగునీరందుతుందని.. ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చిందన్న ఆయన వాదనలో వాస్తవం లేదన్నారు.
ఇది ఖరీదైన నీటిపారుదల వ్యవస్థ అని, పంపులు నడపడానికి అవసరమయ్యే విద్యుత్కు ఫిక్స్డ్ చార్జీలు రూ.3,500 కోట్లు వస్తాయని మొదటి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరించామని రాజేందర్ చెప్పారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు భారమని, మన తర్వాతి తరాలు ఇప్పటికీ కేసీఆర్ చేసిన ఘనతను భరిస్తూనే ఉంటాయన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.