కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని గుండెపోటు కారణంగా అస్వస్థతకి గురైన తారకరత్నకి నిన్న మొత్తం కుప్పం హాస్పిటల్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు దగ్గరుండి అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ డాక్టర్స్ ని హైఅలెర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్ధరాత్రి తారక్ కి బెంగుళూరుకి తీసుకొని వెళ్ళారు. అక్కడ నారాయణ హ్రుదాయాలయలో ట్రీట్మెంట్ జరుగుతుంది. అత్యంత నిపుణులైన డాక్టర్ల బృందం తారక్ కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక హార్ట్ కండిషన్, గుండెకి రక్తాన్ని పంపింగ్ చేసే వ్యవస్థలో బ్లాక్స్ ఉండటం వలన ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్ కండిషన్ లోనే ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక తారక్ పరిస్థితి విషమంగా ఉండటంతో తండ్రి మోహన కృష్ణతో పాటు సుహాసిని, పురందరేశ్వరి బెంగుళూరుకి వెళ్ళారు.
అలాగే తారక్ కూడా ప్రత్యేక విమానంలో బెంగుళూరుకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక నారా చంద్రబాబు నాయుడు సైతం బెంగుళూరుకి వెళ్లి హాస్పిటల్ లో డాక్టర్స్ తో మాట్లాడారు. తారక్ కి అందుతున్న ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక తారక్ ని చూసిన తర్వాత హాస్పిటల్ బయటకి వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారక్ వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారని తెలిపారు. తారక్ త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నఅని అన్నారు. అతనిని సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
రక్తప్రసరణ వ్యవస్థలో ఆటంకాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారని అన్నారు. కుప్పంలో బెంగుళూరు నుంచి వైద్యులని రప్పించి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందించామని, అయితే వారి సూచనలతో అక్కడికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. తారక్ కోలుకొని మరల మన మధ్యకి వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక కుటుంబ సభ్యులు కూడా తారక్ పరిస్థితిని తెలుసుకోవడానికి హాస్పిటల్ కి వెళ్ళడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందనే మాట వినిపిస్తుంది. ఎకో ట్రీట్మెంట్ చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.