త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ వ్యాపారంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వంటి విషయాల్లో బిజీగా ఉన్న ఈయన ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణంలో కూడా తన వంతు ప్రయత్నం మొదలుపెట్టారు.
అందులో భాగంగానే ఏషియన్ సంస్థతో కలిసి ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ తన థియేటర్లో మొదటిసారి రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమాతో మల్టీప్లెక్స్ ను ప్రారంభించడం జరిగింది.
![త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో నాలుగో సినిమా 2 త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో నాలుగో సినిమా](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/3a659d00-fd7e-4ad8-bb32-0fddacde27e5.jpg)
అయితే.. తాజాగా త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై హారిక & హాసిని క్రియేషన్స్ ఆధ్వర్యంలో త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. కాగా, ఇప్పటికే.. త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంట పురంలో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.