బొమ్మరిల్లు బ్యూటీ జెనిలీయా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఓ వెబ్సిరీస్ చేసింది. ఈ సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే..తెలుగులో బొమ్మరిల్లు, ఢీ, రెడీతో పాటు పలు సూపర్హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది జెనీలియా. కెరీర్ సక్సెస్ఫుల్గా సాగుతోన్న తరుణంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను పెళ్లిచేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పేసింది.
దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గత ఏడాది సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి మిస్టర్ మమ్మీ, వేడ్ అనే సినిమాలు చేసింది. తాజాగా జెనీలియా ఓటీటీలోకి ఎంటర్ అవ్వబోతుంది. ట్రయల్ పీరియడ్ పేరుతో ఫస్ట్ టైమ్ ఓ వెబ్సిరీస్ చేస్తోంది. జూలై 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
![ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న జెనీలియా ట్రయల్ పీరియడ్ ..ఎక్కడంటే..? 2 ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న జెనీలియా ట్రయల్ పీరియడ్ ..ఎక్కడంటే..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-06T125254.093.jpg)
జెనీలియా ట్రయల్ పీరియడ్ :
తండ్రి గురించి అన్వేషించే ఓ యువతి కథతో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ట్రయల్ పీరియడ్ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ ట్రయల్ పీరియడ్ సిరీస్కు అలేయా సేన్ దర్శకత్వం వహిస్తోన్నారు. జెనీలియా నటిస్తోన్న ఫస్ట్ వెబ్సిరీస్ ఇదే కావడం గమనార్హం. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ను స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత జెనీలియా తెలుగులో జూనియర్ అనే సినిమాలో నటిస్తోంది. గాలి జనార్ధన్రెడ్డి తనయుడు కిరీటి ఈ మూవీతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న జూనియర్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.