హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ తరహాలో వచ్చే ఏడాది నాటికి రాజమహేంద్రవరంలో రూ.70 కోట్లతో గోదావరి బండ్ నిర్మిస్తామని రాజమహేంద్రవరం ఎంపీ ఎం.భరత్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
సోమవారం ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్, సిటీ చిరంజీవి యువత సహకారంతో దివంగత తెలుగు సినీ నటుడు ఎస్.వి. రంగారావు జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో అట్టహాసంగా జరిపారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భరత్ మాట్లాడుతూ వారం రోజుల్లోగా గోదావరి బండ్ పనులకు టెండర్లు రావడం అదృష్టమని, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. ఎస్ వి. రంగారావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో 300 చిత్రాలకు పైగా కనిపించిన తెలుగు నటుడు.
పౌరాణిక, సోషియో ఫాంటసీ చిత్రాల్లో ఎస్వీఆర్ అద్భుతమైన పాత్రలు పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పంతం ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పందం కొండలరావు అధ్యక్షత వహించారు.
కాకినాడలో ఎస్వీ రంగారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ ఎస్వీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్వీఆర్ చర్యను ఆయన అభినందించారు.