Goutham Gambhir: ఇండియా జట్టుపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ ఆటగాడు ఎలాంటి ప్రదర్శన చేయనున్నాడో కూడా ముందే ఊహించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పట్టుమని ఒక మ్యాచ్ కూడా ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా జట్టు ఆడలేదు. కానీ అంచనాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లు జట్టు రాణిస్తుందో లేదో చూడాలి.
“నేను అయితే తుది జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో షమీని, దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకునేవాడిని” అని తెలిపాడు. జట్టులో ముగ్గురు పేసర్లు ఉండాలని, అర్శ్ దీప్, హర్షల్ పటేల్ కు తోడుగా షమీ ఉంటే బాగుంటుందని అన్నాడు. స్వింగ్ తో పాటు బౌలర్ కు వేగం కూడా ముఖ్యమని అన్నాడు. దీని కారణంగా నేను తుది జట్టులోకి షమీని కొనసాగిస్తానని అన్నాడు. అదేవిధంగా దినేష్ కార్తీక్ కు బదులుగా రిషబ్ పంత్ ను ఎందుకు కొనసాగించాలో కూడా తెలిపాడు.
గంభీర్ ఏమన్నాడంటే “ఓ ఆటగాడిని కేవలం 8-10 బంతులు ఆడించడానికి జట్టులో ఉంచకూడదని, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలని అన్నాడు. దీనికి రిషబ్ పంత్ సరైన ఆటగాడని తెలిపాడు. అనుకోకుండా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ముందే పెవిలియన్ చేరితే ఇండియా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాడు. డెత్ ఓవర్లలో మాత్రమే కాకుండా అన్ని పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడే ఆటగాడు తుది జట్టులో ఉండాలి” అని తెలిపాడు.
Goutham Gambhir
అక్టోబరు 23న ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ గంభీర్ వ్యాఖ్యలకు అనుగుణంగా షమీ, రిషబ్ పంత్ లను జట్టులో కొనసాగిస్తాడో లేదా భువనేశ్వర్ కుమార్ ను, దినేష్ కార్తీక్ ను జట్టులో ఉంచుకుంటాడో తేలుతుంది. మొత్తానికి టోర్నీ ముగిసే సమయానికి ఈ నలుగురు క్రికెటర్లు మ్యాచులు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ తుది జట్టును ఎంపిక చేయడానికి తలలు పట్టుకుంటున్నారు.