Gudiwada Amarnath: మూడు రాజధానుల బిల్లుపై మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లు త్వరలోనే ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా మూడు రాజాధానుల బిల్లు ఖచ్చితంగా ప్రవేశపెడతామని బహిరంగంగా మీడియా ముందు మంత్రి అమర్ నాథ్ ప్రకటించారు. అంతేకాదు విశాఖ నుంచి జగన్ పాలన ఎప్పుడు ఉంటుందనే దానిపై అమర్ నాథ్ క్లారిటీ ఇచ్చారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగానే జగన్ పాలన ఉంటుందని రెడీగా ఉండండి అంటూ మీడియా ప్రతినిధులకు సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులతో అమర్ నాథ్ చిట్ చాట్ నిర్వహించారు. మూడు రాజధాలను వెనక్కి తగ్గే అవకాశం లేదని, బిల్లు ఉంటుందని తెలిపారు. అమరావతిలో రాజధాని కోసం కోట్ల రూపాయాల డబ్బు ఖర్చు అవుతుందని, అంత డబ్బుల ఖర్చు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృద్ది చేసుకోవచ్చని, అమరావతి రైతుల పాదయాత్రలో ఏం జరిగినా టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు.
విశాఖలో భూఅక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. భూఅక్రమాలపై టీడీపీ నేతలు ఆధారాలు చూపాలని, విశాఖలో రాజధాని కోసం అసలు ఓ సెంటు భూమి కూడా తీసుకోలేదన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని అమర్ నాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్ మెంట్ మీట్ జరగనుందన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ లో రాష్ట్రం తొలి స్థానంలో ఉందని, 301 అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్ ఇచ్చారని చెప్పారు.
Gudiwada Amarnath:
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అసెంబ్లీకి వచ్చే చిద్దశుద్ది లేదని, అసలు అసెంబ్లీలో ఆయనకు గౌరవం లేదని మంత్రి అమర్ నాథ్ ఆరోపించారు. చంద్రబాబు ఆలోచనలను ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో మాత్రమే ప్రతిపక్షం నెుంబర్ 1 అని విమర్శలు కురిపించారు.