Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి తన తల్లిదండ్రులను డిస్చార్జ్ చేయించి స్వయంగా తన కారులో ఇంటికి తీసుకొని వెళ్తాడు. ముందు వసు కూర్చోగా వెనుకాల జగతి దంపతులు కూర్చుంటారు. ఇక జగతి రిషి, వసు లను చూసి సంతోషపడుతుంది. అంతేకాకుండా ఇద్దరూ ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు అని అనుకుంటుంది.
మహేంద్ర వర్మ కూడా రిషి ని చూస్తూ నిన్ను బాధ పెట్టినందుకు సారీ అని మళ్లీ ఇలా ఎప్పుడు చేయను అని అనుకుంటాడు. తర్వాత రిషి కారుకి సడన్ బ్రేక్ వేయడంతో జగతి ముందుకు జరిగి అమ్మ అనడంతో వెంటనే రిషి సారీ చెబుతాడు. తర్వాత కారుని మెల్లగా తీసుకొని వెళ్తాడు. దాంతో జగతి నా కొడుకు నాకు సారీ చెప్పి నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు అని మురిసిపోతుంది.
ఇక ఈ విషయాన్ని మహేంద్ర కు చెప్పాలి.. ఈ సంతోషాన్ని తనకు కూడా పంచాలి అని అనుకుంటుంది. దాంతో మహేంద్ర కు మెసేజ్ చేస్తుంది. రిషి నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.. ఈ జన్మకు ఇది చాలు.. శాశ్వతంగా కళ్ళు మూసుకున్న పరవాలేదు అంటూ ఎమోషనల్ గా మెసేజ్ పెడుతుంది. కానీ ఫోన్ మాత్రం కారులో రిషి పక్కన ఉంటుంది.
మహేంద్ర వర్మ మాత్రం ఫోన్ ని పట్టించుకోడు. ఇక అది రిషి దగ్గర ఉంది అని జగతి కంగారుపడుతుంది. తర్వాత రిషి ఫోన్ తీసి చూడగా అందులో జగతి చేసిన మెసేజ్ చూసి వెంటనే డిలీట్ చేసి సారీ డాడీ ఈ మెసేజ్ డిలీట్ చేసినందుకు అని అనుకుంటాడు. జగతి మహేంద్ర ఫోన్ అని అనడంతో రిషి కూడా డాడ్ ఫోన్ అని ఇస్తాడు.
ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఇక ఇంటి గుమ్మం ఎదురుగా దేవయాని నిలబడుతుంది. వారిని చూసి మళ్ళీ ఇక్కడికే వచ్చారు అని కోపంతో అనుకుంటుంది దేవయాని. తర్వాత జగతి దంపతులను జాగ్రత్తగా తీసుకుని వస్తుండగా వసు కారు వెనకాల ఉన్న బుట్టని తీసుకురావడానికి వెళ్తుంది. ఆ సమయంలో జగతి కాస్త తూలుతూ ఉండగా రిషి వచ్చి జాగ్రత్త మేడం అని పట్టుకుంటాడు.
అది చూసి జగతి సంతోషపడగా దేవయాని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా ధరణి ఎవరి దిష్టి తగిలిందో అని దేవయానిని ఉద్దేశించి వారికి దిష్టితీస్తుంది. దాంతో దేవయానికి బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే రిషి తన తండ్రిని హగ్ చేసుకుని సంతోషంగా ఫీల్ అవుతాడు.
జగతితో కింద ఉన్న తన గదిని వాడుకోమని అంటాడు. ఇక ఆ మాటలకు మాత్రం దేవయానికి బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత ధరణి వంట గదిలో వంట చేస్తూ ఉండగా దేవయాని వచ్చి ధరణిపై ఫైర్ అవుతుంది. పెత్తనం ఎందుకు చేస్తున్నావు అంటూ.. నిన్ను దిష్టి ఎవరు తీయమన్నారు అంటూ కోపం అవుతుంది. ధరణి మామయ్య గారు తీయమన్నారు అనడంతో దేవయాని ఏమీ అనలేకపోతుంది.
అదే సమయంలో అక్కడికి ఫణింద్ర వర్మ రావటంతో వెంటనే ధరణి కావాలంటే మామయ్య గారిని అడగండి అంటూ ఫణింద్ర వర్మ అని పిలుస్తుంది. దేవయాని మాత్రం వద్దు అంటూ కోపంతో చెబుతుంది. ఫణింద్ర వర్మ ఏంటి అని అడగటంతో కాఫీ అంటూ సరిదిద్దుతుంది దేవయాని. ఇక వసు జగతి కోసం రూమ్ నీట్ గా పెడుతుంది.
Guppedantha Manasu:
అప్పుడే అక్కడికి రిషి వచ్చి మేడంకు జ్యూస్ తెమ్మని ఉంటాడు. జగతి వద్దన్నా కూడా రిషి వెళ్ళు అంటూ వసుతో అంటాడు. ఇక వసు తన మనసులో సర్ మేడంతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని వెళ్తుంది. తర్వాత రిషి జగతితో ఎలా ఉంది అని మాట్లాడతాడు. తర్వాత తను చేసిన మెసేజ్ గురించి చెప్పటంతో జగతి షాక్ అవుతుంది. ఆ మెసేజ్ డిలీట్ చేశాను అని అంటాడు రిషి. ఎందుకంటే డాడీ కి ఏమైనా అవుతే నేను ఉండలేను అంటూ అలాంటిది మీరు మెసేజ్లు శాశ్వతంగా కళ్ళు మూస్తే బాగుంటుంది అని పెట్టారు అది చూసి డాడ్ తట్టుకోలేడు. ఎందుకంటే డాడీకి మీరు అంటే చాలా ఇష్టం అంటూ మాట్లాడుతాడు.