Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర వర్మ ఇన్నాళ్లు రిషి ని బాధపెట్టాను.. తీరా రిషి దగ్గరికి వెళ్లేటప్పుడు ఇలా జరిగింది అని బాధపడతాడు. జగతి పరిస్థితి చూసి బాధపడటంతో ఏం కాదు అంటూ ధైర్యం ఇస్తాడు గౌతమ్. ఆ తర్వాత జాగ్రత్తగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతాడు మహేంద్ర వర్మ. అంతేకాకుండా మేము నీ ప్లాట్లో ఉన్నట్లు తెలియకూడదు అని అంటాడు.
మరో వైపు తల్లికి బ్లడ్ ఇస్తున్న రిషి ని చూసి వసు సంతోషపడుతుంది. మీ ఇద్దరిని నేను కలపడం ఏంటి ఆ దేవుడే మిమ్మల్ని కలిపాడు అని అనుకుంటుంది. తర్వాత రిషి వసుతో మేడం కి ఏం కాదని డాడీ తో చెప్పు అని అంటాడు. తర్వాత అక్కడినుంచి దగ్గరికి వెళ్లి మేడం మీ అబ్బాయి నీకు బ్లడ్ ఇస్తున్నారు ఏమి కాదు అని అంటుంది.
ఇక గౌతమ్ మహేంద్ర కోసం టీ తీసుకుని వస్తాడు. జగతి గురించి అడగటంతో ఏం కాదు అని ధైర్యం ఇస్తాడు. అదే సమయంలో వసు వచ్చి ఫణీంద్ర వర్మ సార్ వస్తున్నారని చెబుతుంది. దాంతో మహేంద్ర కూడా వస్తుంది ఈ సమయాన్ని చూసి అవకాశంగా మార్చుకుంటుంది మీరు తనని ఏమనకండి అని అంటాడు. అయినా రిషి నా కొడుకు.. ఆమెకు భయపడాల్సిన అవసరమేంటి.. వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఇక ఎవరికి భయపడను అని అంటాడు.
తర్వాత రిషిని జాగ్రత్తగా చూసినందుకు వసు కు థాంక్స్ చెబుతాడు మహేంద్ర. ఇక రిషి తన తల్లికి బ్లడ్ ఇవ్వడం పూర్తయ్యాక డాక్టర్ వచ్చి జగతి పరిస్థితి చూసి జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. దాంతో రిషి తన తల్లిని అలాగే చూస్తూ తనతో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆ సమయంలో జగతి రిషి అంటూ కలవరిస్తుంది.
ఇక్కడున్న డాక్టర్ రిషి అంటే మీరేనా అని.. తనకు మీరేమవుతారు అని అడుగుతుంది. ఇక మీరు బ్లడ్ ఇచ్చారు కదా ఏమీ కాదు అని చెప్పి అక్కడి నుంచి ఇప్పుడే వస్తాను అని వెళుతుంది. ఇక రిషి జగతి వైపు చూస్తూ మీ ఇద్దరికీ ఇలా యాక్సిడెంట్ అవ్వడం చాలా బాధనిపించింది అంటూ.. మీరు అంటే డాడ్ కు ప్రాణం.. మీరు ఎప్పుడు బాగుండాలి అని అనుకుంటాడు.
తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్తుండగా స్పృహలో లేకున్నా కూడా జగతి రిషి చేయి పట్టుకుంటుంది. ఆ తర్వాత మీకు స్పృహ లేకపోయినా నా మాటలు మీకు చేరుతున్నాయి అనుకుంటున్నాను అని తన చేతులు పక్కకు పెట్టి అంటాడు. ఇక జగతి రిషి నీ దగ్గరికి వస్తున్నాము అని కలవరిస్తుంది. దాంతో రిషి ఆమె తల నిమురుతు చెవి దగ్గర నీకేమీ కాదు అని అంటాడు.
ఆ తర్వాత జగతి దాహం అనడంతో రిషి తనకు నీళ్లు తాపిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర వాళ్ళు అది చూసి సంతోషపడతారు. లోపలికి వెళ్దాం అని అనటంతో.. గౌతమ్ వద్దు అని ఆ తల్లి కొడుకుల్ని కాసేపు అలాగే వదిలేద్దాం అని అంటాడు. వారిద్దరిని అలా చూసుకుంటూ మురిసిపోతారు. ఫణీంద్ర దంపతులు హాస్పిటల్ కి చేరుకుంటారు.
Guppedantha Manasu:
ఇక రిషి మేడంని జాగ్రత్తగా చూసుకోమని నర్సుకు చెప్పి అక్కడినుంచి వెళ్తాడు. బయటకు రిషి రాగానే వెంటనే మహేంద్ర గట్టిగా హగ్ చేసుకుంటాడు. కలిసి మేడంకి ఏం కాదు అని ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత తను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాను ఆ విషయం నీకు చెప్పాలి అనడంతో ఆ విషయాలు ఎందుకులే డాడ్ అని అంటాడు.