తొలిప్రేమ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ టాలెంటెడ్ వెంకీ అట్లూరి. మొదటి సీనిమాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు తరువాత అఖిల్ తో మిస్టర్ మజ్ను, నితిన్ తో రంగ్ దే సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా కూడా సౌత్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ధనుష్ హీరోగా సార్ అంటూ ఒక్క సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకి వచ్చినట్లు తెలుస్తుంది .
ధనుష్ సౌత్ బాషలలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో కూడా ఈ మధ్య మెరుస్తున్నాడు. మొదటి సారి స్ట్రైట్ గా తెలుగు దర్శకుడుతో సినిమా చేస్తున్నాడు సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ మూవీని సంయుక్తం నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక విద్యావ్యవస్థలో లోపాలపై ఈ సినిమాలోకి కీలక పాయింట్ ని దర్శకుడు వెంకీ టచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ ఫస్ట్ లుక్ తో పాటు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా గురువారం సాయంత్రం ఆరు గంటలకి ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమా ముగింపు దశకి కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ప్యాకప్ చెప్పబోతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. భీమ్లానాయక్ సినిమాలో రానాకి జోడీగా నటించేసిన సంయుక్త మీనన్ ఈ మూవీలో ధనుష్ కి హీరోయిన్ గా కనిపించబోతుంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉండుంటుంది అనేది రివీల్ చేయలేదు. ఇక సినిమాలో సాయి కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ఆయనకి బర్త్ డే విషెస్ చెప్పి కన్ఫర్మ్ చేశారు.