సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ప్రయాణం ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు వృత్తిరీత్యా డాక్టర్లుగా ఉన్నవాళ్లు తర్వాత యాక్టర్లుగా మారుతారు. అలాగే డిఫరెంట్ ప్రొఫెషన్ లో ఉండి నటులు, దర్శకుడు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇలా సినిమా మీద వాళ్ళకి ఉన్న ఇష్టం కారణంగా ఇటువైపుగా అడుగులు వేసి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సక్సెస్ ఆస్వాదించారు. అలాగే నటులుగా చేసిన వాళ్లు కూడా దర్శకులు అవతారం ఎత్తారు. అయితే నటన వైపు నుంచి దర్శకత్వం వైపు వచ్చిన చాలామంది దానిని ఒక ఇంట్రెస్ట్ గా మాత్రమే తీసుకొని చేశారు తప్ప నటనకు స్వస్తి చెప్పలేదు. కొంతమంది దర్శకత్వము వైపు నుంచి నటులుగా మారి సక్సెస్ అయిన స్టార్స్ కూడా ఉన్నారు.
తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్టర్ గా కంటే నటుడుగానే అందరికీ సుపరిచితం. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ ఓవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు దర్శకుడుగా సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ కూడా సౌత్ లో నటుడుగా సత్తా చాటుతున్నాడు. ఇలా చాలామంది దర్శకత్వం వైపు నుంచి నటన వైపు నటన వైపు నుంచి దర్శకత్వం వైపు తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వీరి లిస్టులో యంగ్ డైరెక్టర్లలో వెంకి అట్లూరి కూడా ఉన్నారు. స్నేహ గీతం సినిమాతో నటుడుగా కెరియర్ స్టార్ట్ చేసిన వెంకీ అట్లూరి ప్రస్తుతం దర్శకుడుగా సక్సెస్ సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాలతో దర్శకుడుగా తనను నిరూపించుకున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీ మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడుగా మల్లిడి వశిష్ట టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఇతను ఒకప్పటి సీనియర్ ప్రొడ్యూసర్ మల్లిడి సత్యనారాయణ కుమారుడు అని అందరికీ తెలిసిందే. అయితే వశిష్ట, వేణు పేరుతో టాలీవుడ్ లో అందరికీ సుపరిచితం. ఇతను హీరోగానే ఇండస్ట్రీ లో కెరియర్ స్టార్ట్ చేసారు. కుల శేఖర్ దర్శకత్వంలో ప్రేమలేఖ రాశా అనే సినిమాతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయిన అంజలి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనేది కూడా ఎవరికి తెలియదు. గేయ రచయిత అయిన కులశేఖర్ కెరియర్ ను కూడా ఈ మూవీ నాశనం చేసింది. అలాంటి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణుకి ఆ ప్రయత్నం విఫలం కావడంతో నటనకి స్వస్తి చెప్పి దర్శకత్వం వైపు అడుగులు వేశారు. అసిస్టెంట్ దర్శకుడుగా పలు సినిమాలకి పనిచేసి ఇప్పుడు బింబిసార తో పూర్తిస్థాయి దర్శకుడుగా నిరూపించుకున్నాడు. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో తనని తాను రిప్రజేంట్ చేసుకున్నాడు.