ఉస్తాద్ రామ్ పోతినేనితో కలిసి ఇండియా నుంచి ఎగిరిపోయే సమయమొచ్చిందంటూ ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి కౌర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఈ ఎగిరిపోయేది సినిమా షూటింగ్ కోసం. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ కనెక్ట్స్ బ్యానర్పై పూరి జన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ను ముంబైలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. రామ్తో పాటు పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా తొలి షెడ్యూల్లో పాల్గొన్నారు. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బిగ్ బుల్ ఫస్ట్ లుక్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది
‘మా ఫస్ట్ యాక్షన్-ప్యాక్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు పిచ్చెక్కించే మరో క్రేజీ షూట్ కోసం భారతదేశం నుండి బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది. ‘డబుల్ ఇస్మార్ట్’ ని 2024 మార్చి 8న విడుదలవుతుంది’ అని ఛార్మీ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే, రామ్తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు.
![ఎగిరిపోతే ఎంత బాగుంటుంది .రామ్తో ఫొటో షేర్ చేసిన ఛార్మి 2 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది .రామ్తో ఫొటో షేర్ చేసిన ఛార్మి](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-31T175924.420.jpg)
రామ్, పూరి డెడ్లీ కాంబినేషన్లో బ్లాక్బస్టర్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఒకప్పుడు వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న పూరి, ఛార్మికి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఎంతో ఉపసమనాన్ని ఇచ్చింది. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ‘లైగర్’తో కష్టాల్లో పడిన పూరి, ఛార్మి.. ‘డబుల్ ఇస్మార్ట్’తో గట్టెక్కాలని అనుకుంటున్నారు. అందుకే, పూరి జగన్నాథ్ ఎంతో కసితో కథ రాశారట. . దీనికి తోడు ఇది పాన్ ఇండియా మూవీ.
అలాగే, పూరి జగన్నాథ్ గత చిత్రాలకు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కేచ పనిచేసారు .. ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో అధిక బడ్జెట్తో ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో మేకర్స్ వెల్లడిస్తామన్నారు . వచ్చే ఏడాది మహాశివరాత్రికి అంటే మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల కానుంది.