సికింద్రాబాద్ లష్కర్ మహంకాళి బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. బోనాల జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు.
లష్కర్ బోనాల వేడుకల్లో భాగంగా రంగం కార్యక్రమం ప్రతిఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఇచ్చిన వాగ్ధానాలు మరిచిపోయారని అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణత భవిష్యవాణిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఒడిదొడుకులు ఉన్నా.. వర్షాలు కురుస్తాయన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు స్వర్ణలత.
భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. చేసినా పూజలు అన్ని సంతోషంగా అందుకున్నానాని , గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచారు అని వాటిని గుర్తు చేసుకోండని అలాగే , కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే ఎల్లప్పుడూ ఉంటానని భక్తులని కాపాడుకుంటానని పలికారు మాతంగి స్వర్ణలత. ఐదు వారాలు నాకు సాక పోయండని చెప్పారు స్వర్ణలత.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రంగం కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పటం సంతోషంగా ఉందని అన్నారు. కాసేపట్లో పోతరాజులు ఊరేగింపు, ఘటోత్సవం జరుగుతుందని చెప్పారు.ఈ రోజు రాత్రి వరకు దర్శనాలు కొనసాగుతాయని అలాగే, సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు.ఈసారి లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారన్నారు
![ఈసారి వర్షాలు బాగా కురుస్తాయి.. కానీ జాగ్రత్త...'రంగం' భవిష్యవాణి 2 ఈసారి వర్షాలు బాగా కురుస్తాయి.. కానీ జాగ్రత్త....'రంగం' భవిష్యవాణి](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/tb-2023-07-10T151246.578.jpg)