ప్రపంచం అంతా డిజిటలైజేషన్ లో దూసుకుపోతుంది. సమస్త ప్రపంచం అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో అంతర్జాలంలో కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాలలో గూగల్ లో ప్రత్యక్షం అవుతుంది. న్యూస్ రూపంలోనో, వీడియో రూపంలోనో లేదంటే ఫోటోల రూపంలోనో సోషల్ మీడియాలోకి వాటికి సంబందించిన సమాచారం వచ్చేస్తుంది. అలాగే మనకి తెలియని ఎన్నో విషయాలు గూగల్ లో దొరుకుతున్నాయి. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే పాలసీలు, స్కీమ్స్ నుంచి సామాన్యుడికి కావాల్సిన చిన్న చిన్న విషయాలు, సరదా సంఘటన వరకు అన్నింటికీ అంతర్జాలం వేదికగా మారింది. లక్షలాది వెబ్ సైట్స్ ఎన్నో రకాల సమాచారాలని అంతర్జాలం ద్వారా పంచుకుంటున్నాయి. లక్షలాది యుట్యూబ్ చానల్స్ ఎంతో ఉపయోగకరమైన విషయాలని వీడియోల ద్వారా అందిస్తుంది.
నేర్చుకోవడం నుంచి తెలుసుకోవడం వరకు అన్ని కూడా అంతర్జాలంతో సాధ్యం అవుతుంది. హ్యూమన్ లైఫ్ కి ఇప్పుడు బెస్ట్ గురు ఎవరంటే వెంటనే ఇంటర్నెట్ అని చెబుతారు. మంచి, చెడు రెండింటిని మనిషి దీని ద్వారా తెలుసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఇదిలా ఉంటే అంతర్జాల ప్రపచంలో ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు ఎన్నో విషయాలని ప్రజలు వెతుకుతూ ఉంటారు. వారి వారి ఇష్టాలు, అవసరాల బట్టి గూగల్ లో వెతికే సమాచారం ఉంటుంది. ఈ ఏడాది ఇండియన్స్ గూగల్ లో ఎక్కువగా వెతికినా టాప్ సమాచారం ఏంటనేది చూస్తే మొదటి స్థానంలో క్రికెట్ ఉండటం విశేషం. ఈ పదాన్ని గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేశారు.
గూగుల్ ఇయర్ ఇన్ సర్చ్ 2022 రిజల్ట్స్ పేరుతో ప్రకటించిన జాబితాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎక్కువగా వెతికారు. అలాగే ఇండియా ప్రభుత్వం రిలీజ్ చేసిన కోవిన్ యాప్ డౌన్ లోడ్ కోసం గూగుల్ ని ఎక్కువ మంది ఆశ్రయించారు. అలాగే ఖతార్ లో జరుగుతున్నా ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టాప్ 5 సెర్చ్ టాపిక్స్ లో ఉండటం విశేషం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానం అగ్నిపథ్ స్కీమ్ కూడా టాప్ లో ఉండటం విశేషం. అలాగే నాటో, ఎన్ఎఫ్టీ, పీఎఫ్ఐ, సరోగసీ, సోలార్ ఎలిప్స్, ఆర్టికల్ 370 టాపిక్స్ టాప్ సెర్చ్ లో ఇండియా నుంచి ఉన్నాయి. అలాగే సినిమాలలో బ్రహ్మాస్త్ర, కేజీఎఫ్ పార్ట్ 2 కోసం ఎక్కువగా సాధించారు. వ్యక్తుల జాబితా చూసుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్, బీజేపీ లీడర్ నుపూర్ శర్మ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇండియన్స్ గూగల్ ని ఆశ్రయించారు.