Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన మామయ్యని ఎలా చూసుకుంటానో అనే విషయం చెబుతూ ఉండగా అప్పుడే ఈ గొడవకి కారణం నువ్వే అంటూ లాస్య కలగ చేసుకుంటుంది. మావయ్య పుట్టినరోజు నాడే కావాలని ప్లాన్ చేశావు అంటూ పనిగట్టుకుని అందరినీ ఇంటికి రప్పించుకున్నావు అంటూ నానా మాటలు అంటుంది. అంతేగాని బలిపశువుని చేసావ్ అని అంటుంది. దాంతో తులసి వెటకారంగా కథను బాగానే అల్లావు అంటూ మాట్లాడుతుంది.
ఏం జరిగినా నేనే కారణం అన్నట్లుగా మాట్లాడుతున్నావ్ అన్నట్లు అంటుంది. ఇక లాస్య మాత్రం అత్తయ్య మామయ్య మధ్య గొడవ జరగడానికి నువ్వే కారణం అని అనటంతో పూర్తి కారణం నేనే అని అనసూయ అంటుంది. దాంతో అయితే నందు తప్పు తెలుసుకున్నవన్నమాట ఇక తప్పు తెలుసుకుంటే సరిపోదు నాన్నని తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని అంటాడు. ఆయన వినేలా లేడు అని అనసూయ అనటంతో నందు వినకుండా ఇంటికి ఎలాగైనా తీసుకొని రమ్మని గట్టిగా అంటాడు.
ఇక తులసి కూడా ఆయన ఎంత చెప్పిన వినడం లేదు అని అంటుంది. కాస్త సమయం ఇస్తే అప్పుడు తీసుకురావచ్చు అంటుంది. మధ్యలో లాస్య మళ్లీ కలుగజేసుకొని మాట్లాడుతుంది. దాంతో నందు కోపం లాస్యను నోరు మూయమని అంటాడు. అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతుంటే నువ్వేం చేసావు అంటూ లాస్య పై విరుచుకుపడతాడు. గొడవ ఆపితే ఇవన్నీ జరిగేవి కాదు కదా అని అంటాడు.
అంటే గొడవలు జరిగితేనే కదా నీకు కడుపు నిండేది అని అంటాడు. దాంతో లాస్య షాక్ అవుతుంది. ఇవన్నీ చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేను ఎలాగైనా నాన్న ఇంటికి రావాలి అని అంటాడు. అంతేకాకుండా నా తండ్రి నాకు కావాలి లేదంటే నువ్వు ఇంట్లో అడుగు పెట్టొద్దు అని తలుపులు వేస్తుండగా తులసి ఆపుతుంది.
తండ్రి మీద ప్రేమతో తల్లిని అవమానించొద్దు అని.. అభి నాపైన చేసిన తప్పు మీరు చేయకండి అని అంటుంది. ఇక పిల్లలు కూడా నందుని అడ్డుకుంటారు. ఇక తులసి కూడా అడ్డుకుంటుంది. తలుపులు వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అంటుంది. అదే సమయంలో అక్కడికి సామ్రాట్ పరంధామయ్యను తీసుకొని వస్తాడు.
వెంటనే తన తండ్రిని చూసి ఆనందంలో హత్తుకుంటాడు. నన్ను క్షమించండి నాన్న అని లోపలికి తీసుకెళ్తుండగా నువ్వు నన్ను క్షమించు నేను ఇంక లోపలికి రాను అని పరంధామయ్య అంటాడు. ఒక మాట చెప్పడానికి వచ్చాను అని ఈ ఇల్లు చాలా కోల్పోయింది ఇకనైనా జాగ్రత్తగా కాపాడుకో అని అంటాడు. నందు బాధపడతాడు. దయచేసి లోపలికి రండి అని బ్రతిమాలుతాడు.
ఇక పరంధామయ్య నేను రాలేను అని మీరు ప్రశాంతంగా ఉండండి అని అమ్మని బాధ పెట్టొద్దు అని అంటాడు. ఇక అనసూయ పరంధామయ్య దగ్గరికి వెళ్ళగా ఆయన దూరం జరుగుతాడు. దయచేసి ఇక్కడే ఉండండి అంటూ బ్రతిమాలుతుంది అనసూయ. లాస్య రెచ్చగొడితే రెచ్చిపోయాను అని తులసి మీద చాడీలు చెప్పేసరికి అలా వచ్చి పోయాను అని అనటంతో వెంటనే లాస్య కలుగ చేసుకుని మీరు తప్పు చేసి నా మీద వేస్తారు ఏంటి అని అంటుంది.
దాంతో తులసి లాస్య పై ఫైర్ అవుతుంది. నందు కూడా లాస్య పై ఫైర్ అవుతాడు. ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యావు అంటూ మాట్లాడుతాడు. మరోవైపు ప్రేమ్ కూడా లాస్య పై అరుస్తాడు. ఇక నందు ఇంట్లో వాళ్ళతో ఎప్పటికీ నీకు పడదు కాబట్టి మనం వెళ్ళిపోదాం అని లాస్యతో అంటాడు.
దాంతో లాస్య ఇటువంటిది జరుగుతుందని ఊహించాను అనుకోని డాక్యుమెంట్స్ తీసుకొని వస్తుంది. అందులో తన పేరు మీద ఇల్లు ఉండటంతో నందు షాక్ అవుతాడు. నేను రాసింది అత్తయ్య గారి పేరు మీద కదా అని తులసి అనటంతో.. అలా అనుకున్నావా నీ ఎమోషన్స్ తో ఆడుకున్నాను అని లాస్య అంటుంది. దాంతో తులసి కోపంతో చేసిన వెదవ పనికి గొప్పగా చెప్పుకుంటున్నావు అంటుంది.