బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ మరియు అలీయా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ దాదాపు అందరికీ తెలిసిందే . మరోవైపు వీరిద్దరి రియల్ లైఫ్ కపుల్స్ కావడం విశేషం. దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా విడుదల సమయంలో బాలీవుడ్ మీడియా చేసిన హడావిడి మాములుగా లేదు మరీ.. విషయం వీక్ గా ఉన్నప్పుడల్ల పబ్లిసిటీ పీక్ లో ఉంటుందని.. ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్ ని గుర్తు చేసేవిధంగా ఉంది బ్రహ్మాస్త్ర మూవీ. ఇది విడుదలైనప్పుడు భారీగా ప్రమోషన్స్ చేసింది.
![ఇది నిజమేనా.. బ్రహ్మాస్త్ర 2 ఇక లేనట్టేనా ? 2 ఇది నిజమేనా.. బ్రహ్మాస్త్ర 2 ఇక లేనట్టేనా ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-03T163107.315.jpg)
అయితే బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 09, 2022న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముఖ్యంగా ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా వాళ్లకి వాళ్లే సూపర్ హిట్ సినిమా అంటూ ప్రకటించుకున్నారు. కానీ రియాలిటీలో చూస్తే.. కానీ అసలు విషయం తెలియలేదు. బ్రహ్మాస్త్ర మూవీని కొనుగోలు చేసిన బయ్యర్లతో పాటు నిర్మాత కరణ్ జోహార్ కూడా భారీగానే నష్టపోయారట. దాదాపు ఈ…. సినిమా రూ.500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా సక్సెస్ సాధించిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు . ఇదిలా ఉంటె ప్రజలని నమ్మించడానికి వచ్చిన ఖర్చులో సగం కంటెంట్ పై పెట్టి ఉంటే.. ఇలా జరిగేది కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి .
అయితే ఈ విషయం పక్కకు పెడితే బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కాకముందే ఈ మూవీని మొత్తం మూడు భాగాలుగా విడతీసారు దర్శఖుడు అయాన్ ముఖర్జీ . సినిమాలో పార్ట్ వన్ క్లైమాక్స్ లో పార్ట్ 2కి సంబంధించిన హింట్ ను కూడా తెలియచేసారు . కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 రావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా ఈ..సినిమా నిర్మాత కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర 2 సినిమా తీయడానికి అసలు ఆసక్తి చూపించడం లేదు . మళ్లీ వందల కోట్ల బడ్జెట్ పెట్టి బ్రహ్మాస్త్ర సినిమా చేయడానికి ముందుకు రావడంలేడు . బ్రహ్మాస్త్ర సినిమా ని పక్కకు పెట్టి వేరే సినిమాలు చేస్తున్నాడే తప్ప.. బ్రహ్మాస్త్ర 2 గురించి కనీసం ఆలోచించడం కూడా లేదట. ఇక చేసేది ఏమి లేక దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా బ్రహ్మస్త్ర సినిమా ను పక్కకు పెట్టి వేరే మూవీస్ పై ఫోకస్ చేయనున్నట్టు బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బ్రహ్మాస్త్ర 2 ఆగిపోయినట్టు తెలుస్తుంది .