మల్లెమాల వారి జబర్దస్త్ కామెడీ రియాలిటీ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ నటులు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. కమెడియన్స్ గా సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ షో ద్వారానే యాంకర్ గా అనసూయ కూడా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలతో నటిగా దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలు చేస్తూ ముందుకెళ్తుంది.
ఇక జబర్దస్త్ స్టార్ట్ అయ్యిన తర్వాత కొన్నేళ్లు చేసిన మధ్యలో ఆమె కొంత గ్యాప్ తీసుకుంది. ఆ సమయంలో యాంకర్ గా రష్మీ ఎంట్రీ ఇచ్చి ఆమె కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జబర్దస్త్ కామెడీ షో తో ఇద్దరు స్టార్ యాంకర్స్ గా మారారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్దస్త్ నుంచి అనసూయ యాంకర్ గా నిష్క్రమించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. ఇప్పుడు ఆమె స్థానంలో ఎవరు కొత్త యాంకర్ గా రాబోతున్నారు అనే ఆసక్తి అంతా నెలకొని ఉంది. అయితే మల్లెమాల ఆస్థాన యాంకర్ గా ఉన్న సీనియర్ యాంకర్ మంజూషని జబర్దస్త్ కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం కొత్త యాంకర్స్ కంటే ఉన్నవాళ్ళతో వెళ్లడం ఉత్తమం అని ఆమెని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నెక్స్ట్ ప్రోమోలో కొత్త యాంకర్ రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే వారు ఎవరనే విషయంపై గోప్యత ఉంచారు. దీంతో రాబోయే కొత్త యాంకర్ ఎవరనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి చాలా మంది ఆర్టిస్ట్ లు నిష్క్రమించారు. కొత్త వారితో కొనసాగిస్తున్నారు. రేటింగ్స్ పరంగా కూడా జబర్దస్త్ కొత్త తగ్గింది. ఈ నేపధ్యంలో రాబోయే కొత్త యాంకర్ ఏ స్థాయిలో మళ్లీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.