చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు బాంద్రాలో నివసిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఇక్కడ సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. తాజాగా జాక్వెలిన్ బాంద్రాలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది.
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన 200 కోట్ల రూపాయల మోసం కేసులో జాక్వెలిన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొంది. ఇవన్నీ ఆమె కెరీర్పై ప్రభావం చూపుతాయని అంటున్నారు. కానీ, అలా జరగలేదు ఆమెకు వస్తున్న ఆఫర్స్ ఎక్కువే ఉన్నాయి. సరే ఇదంతా ఓ వైపు అయితే, మరోవైపు జాక్వెలిన్ కొత్త ఇల్లు కొనుక్కుంది.
![ముంబైలో కాస్ట్లీ ఇల్లు కొన్న జాక్వెలీన్.. ధర ఎంతో తెలుసా? 2 ముంబైలో కాస్ట్లీ ఇల్లు కొన్న జాక్వెలీన్.. ధర ఎంతో తెలుసా?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-03T121910.151.jpg)
ఇల్లు కొన్న జాక్వెలీన్ :
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముంబైలోని బాంద్రాలో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసింది. దీని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరు నటిని అభినందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్ సహా చాలా మంది ప్రముఖులు బాంద్రాలో ఉంటారు. ఈ వరుసలో జాక్వెలిన్ కూడా చేరింది. ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నది. జాక్వెలిన్ అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో జిమ్, బాల్కనీ, ఇతర సౌకర్యాలతో లగ్జరీగా ఉంది. ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ధర 20 కోట్ల పైనే ఉంటుంది.
అయితే లగ్జరీ ఇంటిని జాక్వెలిన్ కొనుక్కుందని తెలిసి.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరికొంతమంది మాత్రం దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సుఖేశ్ చంద్రశేఖర్ ఈ ఇల్లు కొనిచ్చాడా అని అడుగుతున్నారు. సుకేశ్ చంద్రశేఖర్ విషయంలో జాక్వెలిన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
సుఖేష్ చంద్రశేఖర్ కేసులో ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వారిద్దరికి సంబంధించి కొన్ని ప్రైవేట్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. సుఖేష్ జైలు నుంచి కొన్ని రోజుల కిందట ప్రేమ లేఖను(Sukesh Love Letter) జాక్వెలిన్ కోసం పంపించాడు. తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా ఇది వెళ్లినట్టుగా తెలుస్తోంది.