ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేసి, 20 శాతం రాయితీతో ప్లాట్లను ఇస్తున్నామని ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్ శుభవార్త తెలిపారు.
ఈ ప్లాట్లు 200 నుండి 240 చదరపు గజాలు ఉన్నట్టు .. చదరపు గజానికి రూ.17,499గా ధర నిర్ణయించినట్టు వెల్లడించారు. ఒప్పందం అయిన నెల లోపు మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించిన వారికి 5శాతం తగ్గింపు ఉంటుందన్నారు. అంతేకాదు 40శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తున్నట్లు వివేక్ యాదవ్ తెలిపారు.
ఎస్బీఐ, ఐసీఐసీఐ ఈ బ్యాంకుల ద్వారా ఋణం పొందే అవకాశం ఉన్నటు కూడా సూచించారు .. ఇతర వివరాలు ఎంఐజీ పోర్టల్ https://migapdtcp.ap.gov.in, ఏపీసీఆర్డీఏ పోర్టల్ https://crda.ap.gov.in లో ఈ నెల ఆగస్టు 1 నుంచి అందుబాటులో ఉండబోతున్నాయి అని తెలిపారు. ఆగస్టు 31 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని.. ఇతర వివరాలకు 0866-2527124 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. అవసరమైన ఉద్యోగులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు.
అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు మరో అవకాశాన్ని ఇచ్చింది జగన్ సర్కార్. జీవో నంబరు 38 ద్వారా రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా.. వారు కోరుకున్నచోట ప్లాట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో ఉన్న నిబంధనల్ని మార్పులు చేసింది. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేయొచ్చు. ఈ లే అవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా ఉంది. ఈ లే అవుట్స్ వివరాలను https:// migapdtcp. ap. gov. in/ వెబ్సైట్లో చూడొచ్చు.