ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గోదావరి వరదల సమయంలో కూనవరం సబ్ఇన్స్పెక్టర్ బి.వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్స్లో సాహసోపేతమైన కృషి చేశారని కొనియాడారు. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పోలీస్ మెడల్ ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు సిఫార్సు చేశారు.
గోదావరి ముంపునకు గురైన ప్రజలను పరామర్శించేందుకు సిఎం సోమవారం ఎఎస్ఆర్ జిల్లా కూనవరం గ్రామానికి రాగా, వరద బాధిత ప్రజలను రక్షించే సమయంలో సబ్ఇన్స్పెక్టర్ అద్భుత ధైర్యాన్ని ప్రదర్శించారని స్థానికులు, అధికారులు ఆయనకు తెలియజేశారు.
తన దగ్గరే సబ్ ఇన్స్పెక్టర్ ఉండటాన్ని గమనించిన సీఎం, ఆయన సేవలను మెచ్చుకుంటూ భుజాలపై తట్టారు.
గతేడాది గోదావరి వరదల్లో కూనవరం వద్ద కూడా దాదాపు 4,000 నుండి 5,000 మంది వరద బాధిత ప్రజలను రక్షించడంలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సహాయం చేశారని ముఖ్యమంత్రికి సమాచారం అందించారు.
- Read more Political News