తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం పుట్టింది. సీనియర్ ఎమ్మెలే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జంప్ అవుతున్నారు. అయితే పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తారని సమాచారం. ఆయన ఏ పార్టీలో చేరేది స్పష్టత లేదు. టీఆర్ఎస్ లో చేరతారని, మొన్నామధ్య కేటీఆర్ సంగారెడ్డి పోయినప్పుడు ఇద్దరు క్లోజ్ గా మాట్టాడుకున్నారు మీడియా కోడై కూస్తుంది. కానీ జగ్గారెడ్డి స్కెచ్ మాత్రం జగ్గారెడ్డికి ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయనది ధర్మాగ్రమని, కాంగ్రెస్ మీద తిరుగుబాటు కాదని, ఆయన్ను అణగదొక్కాలని చూస్తున్న కొందరు నాయకులపై మాత్రమే జగ్గారెడ్డి పోరాటం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జగ్గన్న జంప్ వ్యవహారం హైదరాబాద్ నుంచి ఇపుడు ఢిల్లీ చేరిందట. ఏఐసీసీ వర్గాలు సీరియస్ గానే ఈ విషయాన్ని పరిశీస్తున్నారని తెలుస్తోంది. పార్టీకి పూర్వ వైభవం సంగతి అటుంచి, ఉన్న వాళ్లు వెళ్లిపోవడమే తెలంగాణ కాంగ్రెస్ తో ఢిల్లీ పెద్దలను కలవరపెడుతోంది. ఇది జగ్గారెడ్డితోనే ఆగుతుందా…? ఇంకా కొనసాగుతుందా అని హస్తం పెద్దలు తలలుపట్టుకుంటున్నార..!! ఇంతకూ జగ్గన్న ఎటు పోతున్నట్టు..?? పార్టీ వీడాక ఏం చెయ్యబోతున్నట్టు…?