ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఎప్పుడు సినిమాలతో బిజీగా వుండే ఈయన తాజాగా స్క్రీన్ పై కనిపించబోతున్నారు. కానీ ఎప్పటిలాగా సినిమాలలో అతిథి పాత్ర కోసం కాదట. ఈసారి ఓ యాడ్ కోసం స్క్రీన్ పై కనిపించాబోతున్నారు అని తెలుస్తోంది.
![యాడ్ కోసం ఈ న్యూ లుక్లో జక్కన్న.. పారితోషకం ఎంతో తెలుసా ..? 2 యాడ్ కోసం ఈ న్యూ లుక్లో జక్కన్న.. పారితోషకం ఎంతో తెలుసా ..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-03T114636.070.jpg)
ఇటీవలే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ,రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్టు తెలుస్తోంది,రాజమౌళి చేస్తున్న ఈ యాడ్ ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో కోసం అని తెలుస్తుంది. అయితే ఈ యాడ్ కోసం రాజమౌళి మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.
ఇది తెలుసుకున్న రాజమౌళి అభిమానులు సినిమాలకైతే డైరెక్టర్ గా 150 కోట్ల రూపాయల వరకు పారితోషకాన్ని తీసుకునే అతను ఈ యాడ్ కోసం ఇంత తక్కువ పారితోషికం తీసుకోడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. సోషమీడియాలో ఈ యాడ్ క్లిప్స్ ప్రసారం అవుతున్నాయి . అందులో చాలా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు రాజమౌళి. న్యూ లుక్లో జక్కన్న సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.