గత ఎపిసోడ్లో చదువుని దూరం పెట్టిన జానకిని మళ్లీ చదువుకునేలా చేయాలని అనుకుంటాడు రామా. అందుకే శివాలయానికి వెళ్లిన సమయంలో ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత నవంబర్ 28న ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
దీపాన్ని కొనేటిలో వదలబోతూ జానకి ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటాడు రామా. అది తిరని కోరిక అని అంటుంది జానకి. దానికి.. దేవుడు కొన్నింటిని సుసాధ్యం చేస్తుంటాడని తనకి గతంలో ఎదురైన అనుభవాన్ని చెబుతాడు రామా. ‘పెళ్లికి ముందు ఇలాగే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను. అప్పుడే ఈ దేవతని చూశాను. ఈ దేవత పక్కన చోటు దొరికితే బావుంటుందని అనుకున్నా. దేవుడి మన్నించి ఇప్పుడు ఇలా ఉండేలా చేశాడు. మీరు ఐపీఎస్ అవ్వాలనే కోరిక కూడా అలాగే నేరవేరుతుంది’ అని చెబుతాడు రామా. అనంతరం దీపంలాగే వారి జీవితం కూడా హాయిగా సాగిపోవాలని అనుకుంటూ కోనేటిలో దీపాన్ని వదులుతారు.
అదే సమయంలో.. జెస్సీ, జానకి తమ భర్తలతో దీపాలు వదులుతుండగా తను మాత్రం ఒంటరిగా వదలాల్సి వస్తుందని మనసులోనే బాధపడుతుంది మల్లిక. అలాగే.. జానకి దీపాన్ని ఆర్పేయడానికి నీటిని జానకి వదిలిన దీపానికి తగిలేలా కదిలిస్తూ ఉంటుంది. నీటి కదలిక చూసి దీపాలు మునిగిపోతాయని బాధపడతాడు రామా. మల్లిక నీటిని కదిలించడం చూసి ఏం చేస్తున్నారని అంటుంది చికితా. తన మాటలు పట్టించుకోకుండా నీటిని కదలిస్తూనే ఉంటుంది మల్లిక. అదంతా జానకి చూసేస్తుంది. ఇంతలో మల్లిక దీపమే మునిగిపోతుంది. అది చూసి.. తన దొంగ కడుపు గురించి అత్తకి తెలిసిపోతుందేమోనని భయపడుతుంది మల్లిక. ఇంతలో జానకి మనసులో మల్లికని తిట్టడం మల్లికకి వినిపిస్తుంది. అది విని.. తన మనసులో మాటలు వినిపించడం ఏంటని కంగారుగా అనుకుంటుంది మల్లిక.
అప్పటికే పంతులు హోమం ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటారు. అప్పుడే అక్కడికి అందరూ వస్తారు. అందరు కంగారుగా ఉండడం చూసి ఏమైందని అడుగుతాడు గోవిందరాజులు. దానికి.. మల్లిక వదిలిన దీపం మునిగిపోయిందని చెబుతుంది చికిత. అది విని.. అన్ని ఆకతాయి పనులేనని మల్లికని తిడతాడు గోవిందరాజులు. అత్త జ్ఞానాంబ కూడా జాగ్రత్తగా ఉండమని మల్లికని హెచ్చరిస్తుంది. అనంతరం మల్లిక హోమం చేస్తూ.. కడుపు లేకుండా హోమం చేయడం ఏంటని చిరాకు పడుతుంది మల్లిక. అది చూసి.. దీపం మునిగిపోవడం గురించి ఆలోచించకుండా ఉండమని, హాస్పిటల్కి వెళ్లి స్కానింగ్ చేద్దామని అంటుంది జ్ఞానాంబ. అది విని.. వణికిపోతుంది మల్లిక. అది గమనించిన గోవిందరాజులు ఎందుకలా ఉన్నావని అడుగుతాడు. అది విని.. బయట పడిపోతుందని భయపడిపోతున్నట్లు ఉందని అంటుంది జానకి. అది విని.. ఏం బయట పడుతుందని రామా అడగగా.. మల్లికకి రక్తం అంటే భయం అని వణికిపోతున్నట్లు ఉందని అంటుంది జానకి.
అనంతరం కొబ్బరికాయల కోసం కారు దగ్గరకి వెళుతుంది జానకి. ఇంతలో సునంద అక్కడికి వస్తుంది. వారంతా సంతోషంగా ఉండడం చూసి అసూయపడుతుంది సునంద. ‘జైలుకి వెళ్లాల్సిన నీ కొడుకు సేఫ్ అయ్యాడని జనం అనుకుంటున్నారు’ అని వెటకారంగా అంటుంది సునంద. అది విని.. వాటి గురించి మాట్లాడొద్దని అంటుంది జ్ఞానాంబ. ఇంతలో మరో మహిళ వచ్చిన పెద్ద కోడలుకి కాకుండా మిగిలిన ఇద్దరితో హోమం చేయిస్తున్నారేంటని అడుగుతుంది. అది విని.. ఆమె వీరిద్దరు కడుపుతో ఉన్నారని, జానకికి ఇంకా కడుపు పండలేదని బాధ నటిస్తూ అంటుంది సునంద. ఇంతలో అక్కడికి వచ్చిన జానకి మీరంతా బాధ పడాల్సిన పని లేదని అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్లో చూడండి.