తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
జాన్వీ కి తిరుమల వెంకన్న అంటే చాలా ఇష్టం. ఏడాదిలో ఆమె చాలాసార్లు తిరుమలకు వస్తుంటారు. కొన్నిసార్లు కాలి నడకన సైతం వెళ్తుంటుంది. సోమవారం ఉదయం జాన్వీ లంగావోణిలో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిలాగ తయారై శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.
శ్రీదేవి కూతురు, బాలీవుడ్ లో ఈ.. ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వరుని దర్శనం తర్వాత శ్రీవారికి దండాలు పెడుతూ ఆలయం నుంచి బయటికి వచ్చారంట జాన్వీ. ఆలయం నుంచి బయటికి వచ్చాక గుడి ముందు సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొంది జాన్వీ. ఇక ఇప్పుడు మరో షెడ్యూల్లో పాల్గొననుంది. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్. ఇందులో భాగంగా జాన్వీ దేవర తదుపరి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొననుందని.. అదే సమయంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.