జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు.దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ పరిశ్రమలోకి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా బాలీవుడ్ పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ పరిశ్రమలో కూడా సినిమా అవకాశాలను అందుకొని సౌత్ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఈమె ,ఎన్టీఆర్ హీరోగా ,కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.ఆమె బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్తో కలిసి అభిమానులతో చిట్ చాట్ నేపథ్యంలో భాగంగా మాట్లాడిన ఆమె.. ‘ఎన్టీఆర్- కొరటాల శివ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఎలాగైనా ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించాను. మొత్తానికి సెలెక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.