JayaPrakash Narayana: సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల బిల్లును మళ్లీ తెచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. అమరావతి రైతులు, ప్రతిపక్ష పార్టీలు నుంచి వ్యతిరేకత వస్తున్నా సరే.. మూడు రాజధానుల బిల్లును తెచ్చేందుకే జగన్ మొగ్గు చూపుతున్నారు. ఇవాళ అసెంబ్లీ మూడు రాజధానులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాలన వికేంద్రీకరణ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. దీనిని బట్టి చూస్తే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఖాయమని తెలుస్తోంది. పరిపానల వికేంద్రీకరణపై అసెంబ్లీ నేడు స్వల్పకాలిక చర్చ జరిగింది.
ఈ సంరద్భంగా అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీలో నిరసనకు దిగండతో వాడివేడిగా మారింది. టీడీపీ సభ్యులు ఒక్కరోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం దుమారం రేపింది. అయితే జగన్ మూడు రాజధానులకు జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలిపారు.
మూడు రాజధానులు మంచి ఆలోచని అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ మంచి అంశమని తెలిపారు. ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తుందని, తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకరణ అయి ఉండటం మంచిది కాదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సూచించారు. జగన్ చేసే మంచి పనులను తాను స్వాగతిస్తున్నట్లు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఇప్పుడు చాలా దేశాలు అభివృద్ధి వీకేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని, జగన్ కూడా ఆ దిశగా అడుగులు వేయడం మంచి పరిణామమని జయప్రకాశ్ నారాయణ తెలిపారు.
JayaPrakash Narayana:
అమరావతి రైతుల పాదయాత్రలో న్యాయం ఉందని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. తమ భూములను త్యాగం చేసిన రైతులకు న్యాయం జరగాలన్నారు. వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ ను జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు కురిపించారు. మంచి పనులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.