Jr NTR: ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఏకంగా ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని యువ సుధా బ్యానర్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం కొలటాల శివ ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కాస్త పకడ్బందీగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకోవడంతో పాటు తారక్ ని మెప్పించి సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక పీరియాడిక్ జోనర్లో కేజిఎఫ్ సిరీస్ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండనున్నట్లుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని అప్పుడే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి కచ్చితంగా మరో రెండేళ్ల సమయం పడుతుంది.
ఇదేలా ఉంటే తాజాగా వెట్రీ మారన్ సినిమా చేయడానికి తారక్ ఓకే చెప్పినట్లుగా సమాచారం. పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు వెట్రి మారన్ తారక్ ని చెప్పి ఒప్పించినట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. దీనికంటే ముందు అత్లీ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వెట్రిమారన్ దర్శకత్వం సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. మొత్తానికి బౌండరీలు దాటిపోయి తమిళ్ స్టార్ దర్శకులు తెలుగులో మొదటి సినిమాని తారక్ తో చేయడానికి రెడీ అవ్వబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమాలని ఈ ఐదేళ్ళలో తారక్ చేయబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది.