బాలీవుడ్ లో వివాదాస్పద నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ కాంగన రనౌత్. సోలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగన తన మూవీ కెరియర్ ని కొనసాగిస్తుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కొత్త కథలతో హీరోయిన్ ఓరియంటెడ్ కథాంశాలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సోలో హీరోయిన్ గా ఏకంగా 200 కోట్ల క్లబ్ లో కాంగన జాయిన్ అయిపోయింది. మణికర్ణిక లాంటి బ్లాక్ బాస్టర్ మూవీతో బాలీవుడ్ లో ఊహించని క్రేజ్ ని సొంతం చేసుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ స్టార్స్ అయిన ఖాన్ త్రయానికి సాధ్యం కాని పాన్ ఇండియా ఇమేజ్ ను కంగనా సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎమర్జెన్సీ అనే సినిమాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తు నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ మూవీలో కాంగన రనౌత్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించబోతుంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ లో బాలీవుడ్ క్వీన్ కాంగన ఇందిరా గాంధీ రూపంలో కట్టిపడేస్తుంది. ఫస్ట్ లుక్ కంటే ఇది మరింత పర్ఫెక్ట్ గా ఉండడం ఈ సినిమాపై ఆమె ఎంత శ్రద్ధ చూపిస్తుందనే విషయం తెలుస్తుంది.
ఇందిరాగాంధీ రూపం మాత్రమే కాకుండా ఆమె నడక, మాట తీరును కూడా ఇందులో అనుకరించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పూర్తిస్థాయిలో దర్శకురాలిగా కూడా తనను తాను ప్రోజక్ట్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నంలో కాంగనా రనౌత్ ఉందని చెప్పాలి. ఈ ఫస్ట్ లుక్ టీజర్ తో బి టౌన్ లో ఒక్కసారి కాంగన ఊహించిన స్థాయిలో వైబ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇక ఎమర్జెన్సీ మూవీకి కేవలం దర్శకురాలిగా కాకుండా నిర్మాతగా కూడా ఆమె వ్యవహరించడం విశేషం. 2023లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీతో కాంగన రనౌత్ బాలీవుడ్ తో పాటు దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది వేచి చూడాలి.