సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గ్యాప్ లేకుండా పాన్ ఇండియా సినిమాలు, అలాగే స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్నీ స్టార్ హీరోల చిత్రాలే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఆమె కన్నడంలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రక్షిత్ శెట్టికి జోడీగా రష్మిక నటించింది. ఇక ఆ మూవీకి రిషబ్ శెట్టి దర్శకుడు.
అయితే రిషబ్ శెట్టి ఇప్పుడు దర్శకుడిగా, హీరోగా కాంతారా అనే సినిమాతో ఇండియన్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. సౌత్ ఇండియా నుంచి స్టార్ హీరోలు అందరూ ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కంటెంట్ పై, అలాగే రిషబ్ శెట్టి యాక్టింగ్, టేకింగ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సినిమాని ఒక క్లాసిక్ గా అభివర్ణిస్తున్నారు. ప్రభాస్, అనుష్క శెట్టి లాంటి స్టార్స్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తనకి హీరోయిన్ గా మొదటి అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టి కాంతారా సినిమా విషయం రష్మిక మందన మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
కనీసం సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ అయితే దానికి సంబంధించి కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. దీనిపై కన్నడ ప్రేక్షకులు రష్మిక మీద చాలా గుర్రుగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. సినిమాలో అవకాశం ఇచ్చి ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం అయిన దర్శకుడిని మరిచిపోతే ఎలా అంటూ రష్మికని ట్రోల్ చేస్తున్నారు. ఎంత సక్సెస్ వచ్చిన కూడా మూలాలు మరిచిపోకూడదు అంటూ సలహాలు ఇస్తున్నారు. ఒక్క ట్వీట్ చేయడానికి కూడా లైఫ్ ఇచ్చిన దర్శకుడి గురించి చేయలేకపోతున్నావ్ అంతో నిన్ను కన్నడ ఫ్యాన్స్ ఎప్పటికి క్షమించరు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.